Viral Video: ‘ఇందిరమ్మను చూడలేదు కానీ..’ ప్రియాంకతో దంపతుల ఆనంద క్షణాలు!
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సభ ముగిసిన అనంతరం ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) రోడ్డు మార్గాన తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో కిషన్నగర్లోని జాగీరు రాజయ్య, రమాదేవి దంపతుల ఇంటికి వెళ్లారు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ప్రియాంక రాకతో ఆ దంపతులు ఆనందంతో మురిసిపోయారు. తాము ఇందిరమ్మను చూడలేదని, ఆమె పోలికలతో ఉన్న ప్రియాంకను చూస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే రోడ్డు మార్గంలో సభకు వచ్చి వెళ్తున్న వాహనాల్లోని మహిళలతో సెల్ఫీలు దిగారు.
Updated : 25 Nov 2023 09:47 IST
Tags :