బ్రేకింగ్

breaking
02 May 2024 | 17:32 IST

వైకాపా రంగుల పిచ్చితో.. రూ 2,300 కోట్లు దుబారా: పవన్‌

పాలకొండ: ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులు వేయడానికి రూ.1300 కోట్లు, తీసేయడానికి రూ.1000 కోట్లు ఖర్చు పెట్టారని జనసేన అధ్యక్షుడు పవన్‌ విమర్శించారు. అందులో రూ.220 కోట్లు వెచ్చిస్తే తోటపల్లి రిజర్వాయర్‌ ఎడమ కాలువ పూర్తయ్యేదన్నారు. మన్యం జిల్లా పాలకొండలో పవన్‌ ప్రసంగించారు. ‘‘ సిక్కోలు యువత భగభగ మండే నిప్పుకణికలు.. తెగించి పోరాడాలి. 1960లో బామిని మండలంలో జగన్‌ లాంటి దోపిడీదారుల దాష్టీకంపై ఉత్తరాంధ్ర ప్రజానీకం తిరగబడింది. ఆ రోజులు మళ్లీ వస్తాయని జగన్‌కు చెప్పాలి. అధికారంలోకి వచ్చాక సీతంపేటలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తి చేస్తాం’’ అని పవన్‌ అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని