IND vs SA: దక్షిణాఫ్రికాపై భారత్ విజయం.. సిరీస్ కైవసం
భారత్ మరో సిరీస్ను కైవసం చేసుకొంది. దక్షిణాఫ్రికాతో ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20 మ్యాచ్లో టీమ్ఇండియా 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 237/3 భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (106*: 47 బంతుల్లో 7 సిక్స్లు, 8 ఫోర్లు) శతకం సాధించాడు. డికాక్ (69*), మార్క్రమ్ (33) రాణించారు. దీంతో మూడు టీ20ల సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకొంది.
Updated : 02 Oct 2022 23:19 IST