PBKS vs LSG: లఖ్‌నవూ ఘన విజయం.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా మార్నస్ స్టొయినిస్‌

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌లో (IPL 2023) మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై లఖ్‌నవూ 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత లఖ్‌నవూ 257/5 భారీ స్కోరు సాధించగా.. అనంతరం పంజాబ్ 201 పరుగులకు ఆలౌటైంది. అథర్వ తైడే (66) అర్ధశతకం సాధించగా.. సికిందర్ రజా (36), జితేశ్‌ శర్మ (24), లివింగ్‌స్టోన్ (23), సామ్ కరన్ (21) ఫర్వాలేదనిపించారు. యశ్ ఠాకూర్ 4, నవీనుల్ హక్ 3, రవి బిష్ణోయ్ 2, స్టొయినిస్‌ ఒక వికెట్ తీశారు. కేఎల్ రాహుల్‌ 9 మంది బౌలర్లను వినియోగించడం గమనార్హం. అంతకుముందు లఖ్‌నవూ భారీ స్కోరు చేయడంలో లఖ్‌నవూ బ్యాటర్లు మార్నస్ స్టొయినిస్ (72) కేల్ మయేర్స్ (54), నికోలస్‌ పూరన్ (45), ఆయుష్ బదోని (43) కీలక పాత్ర పోషించారు.

Updated : 28 Apr 2023 23:51 IST