ఆరెంజ్లతో ఎలక్ట్రి‘సి’టీ!
ఈ మండే వేసవిలో చల్లని ఆరెంజ్ జ్యూస్ తాగితే ఎలా ఉంటుంది? అబ్బా..! మనసుకు ఎంత హాయో.. కదా! బాగా అలసిపోయినప్పుడు
ఈ మండే వేసవిలో చల్లని ఆరెంజ్ జ్యూస్ తాగితే ఎలా ఉంటుంది? అబ్బా..! మనసుకు ఎంత హాయో.. కదా! బాగా అలసిపోయినప్పుడు నారింజ పండ్ల వాసన వచ్చినా చాలు క్షణాల్లో నోట్లో నీళ్లూరుతాయి. కానీ మీకో విషయం తెలుసా.. ఈ ఆరెంజ్లతో కరెంటునూ ఉత్పత్తి చేయొచ్చంట! ‘అయ్యో.. ఇంకా చేయొచ్చంట.. ఏంటండీ బాబూ..! ఏకంగా చేసేస్తుంటేనూ..!’ అదెక్కడో.. ఎలానో.. తెలుసుకోవాలని ఉందా?..
తాజాగా స్పెయిన్లోని సెవిల్లే నగరంలో దాదాపు 48వేల నారింజపండ్లతో విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రయోగం చేశారు. అక్కడి వాతావరణ పరిస్థితుల రీత్యా శీతాకాలంలో నారింజ పండ్లు 16 వేల టన్నులకు పైగా కాస్తాయి. అక్కడి పారిశుద్ధ్య కార్మికులు, ఎమెసెసా, సెవిల్లే నగరానికి నీటి వసతి కల్పించే విభాగాలతో కలిసి పార్క్ డిపార్ట్మెంట్, సిటీ కౌన్సిల్ వారు పైలట్ ప్రోగ్రాం నిర్వహించారు. నారింజ రసం తీసిన తర్వాత 38.6 టన్నుల ఆరెంజెస్ ఇంకా మిగిలిపోతున్నాయట. వాటిని పులియబెట్టి బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తున్నారు. అలాగే పులియబెట్టిన లిక్కర్ నుంచి మీథేన్ వాయువు విడుదల అవుతుంది. దాన్ని జెనరేటర్లోకి పంపిస్తే శక్తి విడుదల అవుతుంది. అధికారుల అంచనా ప్రకారం ఇది 15 వందల కిలో వాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుందట. నీటి శుద్ధీకరణకు కావాల్సినంత శక్తి అందుతుందట.
తొక్కకూ ఓ లెక్కుంది!
అంతేనా.. నారింజ పళ్ల వ్యర్థాలైన తొక్క, పిప్పిని కూడా వదలడం లేదు. వాటిని ఎరువులుగా వాడుతున్నారు. ఈ ప్రయోగం సఫలం అయితే 2023 నాటికి నారింజపండ్లన్నింటినీ రీసైకిల్ చేసి, విద్యుత్తు ఉత్పత్తి చేస్తారట. తొలి ప్రయత్నంలోనే వెయ్యి కిలోల పండ్లు 50 కిలో వాట్ల శక్తినిచ్చాయి. అంటే అయిదు ఇళ్లకు సరిపడా కరెంటు అన్నమాట! ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే సుమారు 73 వేల కుటుంబాలకు విద్యుత్తు సరఫరా అందించొచ్చని అక్కడి వారు అంచనా వేస్తున్నారు. అంటే నేస్తాలూ.. మనం తినే ఆరెంజ్కు అంత రేంజ్ ఉందన్నమాట!!
ఎంచక్కా బ్యాటరీల్లాగా!
సిట్రస్ జాతి పండ్లతో విద్యుత్తు తయారు చేయొచ్చు. వీటిలో ఉండే ఆమ్లాలు, జింక్, రాగి వంటి ఎలక్ట్రోడ్లతో కలిసి కరెంటును పుట్టిస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇవి బ్యాటరీల్లాగ పనిచేస్తాయి. ఇవి చిన్న చిన్న ఎల్ఈడీ బల్బులు, డిజిటల్ గడియారాలు పనిచేసేందుకు శక్తినిస్తాయి. కావాలంటే ఒక ఆరెంజ్ తీసుకుని మీరే ప్రయోగం చేయొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం