Faf du Plessis: అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: వరుసగా ఆరు ఓటములతో సతమతమైన బెంగళూరుకు ఎట్టకేలకు విజయం లభించింది. సరిగ్గా నెల తర్వాత బెంగళూరుకు రెండో గెలుపు కావడం గమనార్హం. మార్చి 25న పంజాబ్పై ఆర్సీబీ గెలిచింది. తాజాగా హైదరాబాద్ను (ఏప్రిల్ 25) వారి సొంతగడ్డపై 35 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో టోర్నీ నుంచి ఇంటిబాట పట్టే ప్రమాదం నుంచి ఆ జట్టుకు కాస్త ఉపశమనం లభించింది. మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (Faf du Plessis) దీనిపై మాట్లాడుతూ.. విజయమే జట్టులో విశ్వాసం నింపగలదని అన్నాడు.
‘‘అంతకుముందు రెండు మ్యాచ్ల్లోనూ మేం గొప్పగా పోరాడాం. హైదరాబాద్తో జరిగిన తొలి మ్యాచ్లో లక్ష్యం 270కి పైగా ఉంటే 260 పరుగులు చేశాం. ఇక కోల్కతాతో కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ రెండు మ్యాచ్ల్లో మేం విజయానికి దగ్గరగా వచ్చాం. కానీ, జట్టులో విశ్వాసం నిండాలంటే మాత్రం గెలవాల్సిందే..! మాటలతో ఎవరిలోనూ విశ్వాసం పెంచలేం. కేవలం మనమిచ్చే ప్రదర్శనే మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది’’ అని డుప్లెసిస్ తెలిపాడు.
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
తమ జట్టులో విరాట్ కోహ్లీ (Virat Kohli) టాప్ స్కోరర్గా ఉన్నాడని, ఇతర ఆటగాళ్లు కూడా ఇప్పుడు తిరిగి ఫామ్లోకి వస్తున్నారని అన్నాడు. ‘‘పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఇతర జట్లు చాలా బలంగా ఉన్నాయి. అలాంటప్పుడు మనం 100శాతం ప్రదర్శన ఇవ్వకపోతే బాధపడాల్సి వస్తుంది. టోర్నీ తొలి అర్ధభాగంలో మా జట్టులో విరాట్ ఒక్కడే పరుగులు చేశాడు. ఇప్పుడు మిగతా వాళ్లూ రాణిస్తున్నారు. గ్రీన్ ఫామ్లోకి రావడం జట్టుకు అదనపు బలం’’ అని బెంగళూరు కెప్టెన్ చెప్పాడు.
తాజా ఐపీఎల్ టోర్నీలో బెంగళూరు తరఫున అత్యధిక పరుగులు చేసిన కోహ్లీ.. ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. గత మ్యాచ్లో అర్ధశతకం చేయగా.. ఈ సీజన్లో 400 పరుగుల మార్క్ దాటేశాడు. ఐపీఎల్ కెరీర్లో విరాట్ ఈ మార్క్ దాటడం ఇది పదోసారి కావడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.