ICICI Credit Cards: 17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది.
ICICI Credit Cards | బెంగళూరు: సాంకేతికత లోపం వల్ల దాదాపు 17 వేల క్రెడిట్ కార్డులు ప్రభావితమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) గురువారం అంగీకరించింది. ఈ కార్డులు డిజిటల్ మాధ్యమాల్లో పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు తెలిపింది. అయితే, దీన్ని వెంటనే సవరించినట్లు బ్యాంకు తెలిపింది. అలాగే ఇప్పటి వరకు డేటాను దుర్వినియోగపర్చినట్లు తమకు సమాచారం అందలేదని తెలిపింది. ఎవరైనా ఆర్థికంగా నష్టపోతే.. పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది.
అసలు ఏమైంది..
బ్యాంకు అధికార ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. ఆన్లైన్లో చూసినప్పుడు ఇప్పటికే ఉన్న కస్టమర్ ఖాతాలకు కొత్త క్రెడిట్ కార్డ్లు (Credit Cards) తప్పుగా అనుసంధానమయ్యాయి. అంటే ఇప్పటికే ఉన్న కస్టమర్లు.. మరొకరి కోసం ఉద్దేశించిన కొత్త కార్డ్ వివరాలను చూడగలిగారు. ఆన్లైన్ బ్యాంకింగ్ పోర్టల్లోకి లాగిన్ అవ్వగానే.. తాము అసలు దరఖాస్తు చేయకున్నా.. కొత్త కార్డ్ వివరాలు కనిపించాయని పలువురు సోషల్ మీడియాలో వెల్లడించారు. బుధవారం సాయంత్రం నుంచే ఈ సమస్య సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి వచ్చింది. బ్యాంకు దీన్ని గురువారం ధ్రువీకరించింది.
ఓటీపీ ఉండగా..
తాజా పరిణామంలో క్రెడిట్ కార్డు (Credit Cards) పూర్తి సంఖ్య, సీవీవీ వంటి వివరాలు బహిర్గతమయ్యాయి. వీటిని దుర్వినియోగపర్చి మోసపూరిత లావాదేవీలు చేసే అవకాశం ఉంటుంది! అయితే, ఓటీపీ లేకుండా ట్రాన్సాక్షన్ చేయడం కుదరదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బహిర్గతమైన వివరాల ద్వారా ఎలాంటి మోసం జరిగి ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నారు.
కార్డులన్నీ బ్లాక్..
మరోవైపు ప్రభావితమైన కార్డులన్నింటినీ బ్లాక్ చేసినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) వెల్లడించింది. కొత్తవారికి మరోసారి కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు సమాచారం దుర్వినియోగమైన ఘటనలు తమ దృష్టికి రాలేదని తెలిపింది. కస్టమర్లు చింతించాల్సిన అవసరం లేదని.. ఎలాంటి నష్టం జరిగినా పరిహారం చెల్లించే బాధ్యత తమదేనని హామీ ఇచ్చింది.
ఆర్బీఐ ఆంక్షల తరుణంలో..
బ్యాంకుల డేటా సెక్యూరిటీ అంశాల్లో లోపాలపై ఆర్బీఐ కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే కోటక్ మహీంద్రా బ్యాంకుపై ఆంక్షలు విధించింది. కొత్త కస్టమర్ల చేరికలు, క్రెడిట్ కార్డుల జారీని నిలిపివేయాలని ఆదేశించింది. ఈ తరుణంలో ఐసీఐసీఐ ఉదంతం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే, సదరు బ్యాంకు మాత్రం ఈ ఆందోళనలను కొట్టిపారేసింది. తాము జారీ చేసిన మొత్తం కార్డుల్లో తాజాగా ప్రభావితమైన వాటి వాటా కేవలం 0.1 శాతం మాత్రమేనని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
Indegene IPO: రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండీజీన్ ఐపీఓ ప్రారంభమైంది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు