ఏ టూ హెచ్‌ సారథులంతా అతివలే

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 29 Oct 2025 05:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిలాబాద్‌ కలెక్టరేట్‌లో మహిళలే అన్ని విభాగాధిపతులుగా పనిచేస్తున్నారు. తాజాగా బదిలీల అనంతరం వచ్చిన వారితో కలిపి రెవెన్యూ కార్యకలాపాలతోపాటు జిల్లా పాలన వ్యవహారాలన్నీ అతివల కనుసన్నల్లోనే కొనసాగుతున్నాయి. రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్‌గా శ్యామలాదేవి పనిచేస్తుండగా పరిపాలన అధికారిగా(ఏఓ) ఈస్టర్‌ వర్ణ కీలకభూమిక పోషిస్తున్నారు. ఇక్కడ ఏ నుంచి హెచ్‌ వరకు ఎనిమిది విభాగాలు ఉండగా ఏ, బీ, ఈ, జీ విభాగాలకు సూపరింటెండెంట్‌గా వర్ణ, సీ విభాగానికి శ్రీవాణి, డీ విభాగానికి కవిత, ఎఫ్‌ విభాగానికి శైలజ, హెచ్‌ విభాగానికి పంచపూల సూపరింటెండెంట్లుగా విధులు నిర్వహిస్తున్నారు. కలెక్టరేట్‌లో అటెండర్‌ మొదలుకుని అదనపు కలెక్టర్‌ వరకు మొత్తం 33 మంది ఉద్యోగులు ఉండగా.. అందులో 21 మంది మహిళలే కావడం విశేషం. ఇందులో ఇటీవల గ్రూప్‌-4 ద్వారా నియమితులైన వారు ఐదుగురు ఉన్నారు.  

ఈనాడు, ఆదిలాబాద్‌; న్యూస్‌టుడే, కలెక్టరేట్(ఆదిలాబాద్‌)

Tags :
Published : 29 Oct 2025 05:29 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు