రాష్ట్రంలో మారిటైం రంగంలో పెట్టుబడులకు అనుకూలం

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 29 Oct 2025 06:23 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి 

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో మారిటైం రంగంలో పెట్టుబడులకు అనువైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. హైస్పీడ్‌ హైవేలు, సరకు రవాణాకు ప్రత్యేక రైల్వే లైన్లు, అంతర్గత జల మార్గాల ద్వారా లాజిస్టిక్‌ మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. ముంబయిలో జరిగిన ‘ఇండియా మారిటైం వీక్‌-2025’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రంలోని ఆరు పోర్టుల ద్వారా తూర్పు తీరంలోని మొత్తం సరకు రవాణాలో 30 శాతం ఏపీ నుంచే జరుగుతోంది. కొత్తగా రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ ఎస్‌ఈజడ్‌ పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం. వాటి ద్వారా ఏటా 350 మిలియన్‌ టన్నుల సరకు రవాణా జరిగే అవకాశం ఏర్పడుతుంది. రాష్ట్రంలో మారిటైమ్‌ రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రోత్సాహకాలు అందించేందుకు పాలసీలు తెచ్చాం’ అని పేర్కొన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, మారిటైమ్‌ బోర్డు ఛైర్మన్‌ దామచర్ల సత్య, ఏపీ ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఛైర్మన్‌ శివప్రసాద్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని