అమ్మో.. కాస్త ఆగితే ప్రాణం పోయేదే!

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 29 Oct 2025 09:05 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అలలు వచ్చేస్తున్నాయ్‌.. ఇరుక్కుపోయేలా ఉన్నాం

మొంథా తుపాను ప్రభావంతో కడలి అల్లకల్లోలంగా మారింది. మూడు రోజులుగా తీరం వెంట అలల ఉద్ధృతి పెరిగింది. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో మంగళవారం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలల్లో అక్కడ సంచరిస్తున్న కొన్ని శునకాలు చిక్కుకుపోయాయి. ఓ భారీ కెరటం సముద్రంలోకి లాక్కెళ్లడంతో ఉక్కిరిబిక్కిరైన ఆ శునకాలు.. అంతలోనే తేరుకుని బతుకుజీవుడా అంటూ ఒడ్డుకొచ్చాయి.

ఇక బతుకుతామంటావా..

హమ్మయ్య.. ఒడ్డు దగ్గర్లోకి వచ్చేశాం

ఈనాడు, నరసాపురం

Tags :
Published : 29 Oct 2025 09:02 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని