అగాథాల విభజనకు ఊహాజనిత రేఖలు

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 29 Oct 2025 07:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

బంగాళాఖాతంలో ఏర్పడే వాతావరణ మార్పులను తెలియజేసే క్రమంలో భారత వాతావరణ విభాగం సహా పలు అంతర్జాతీయ మోడళ్లు సముద్రాన్ని పలు భాగాలుగా వర్ణిస్తుంటాయి. అక్కడ ఏర్పడే సుడిగుండాలు ఏ దిశలో పయనిస్తూ, ఎక్కడ తీరానికి చేరువ అవుతాయో చెబుతుంటాయి. ఇలా సముద్రాన్ని పలు భాగాలుగా, దిక్కులుగా విభజించే విధానం ఆసక్తికరం. భూమిపై మాదిరిగానే సముద్రాల్లోనూ తూర్పు, పశ్చిమ, ఉత్తరం, దక్షిణ దిక్కులను రేఖాంశాలు, అక్షాంశాల ఆధారంగా విభజించారు. వాతావరణ మార్పులు ఏర్పడినప్పుడు సంబంధిత దిక్కులను సూచిస్తూ వివరాలు వెల్లడిస్తారు.

  • బంగాళాఖాతాన్ని 6 భాగాలుగా, 8 దిక్కులుగా విభజించారు. చిత్రపటంపై చెన్నై నుంచి అండమాన్‌ రాజధాని పోర్ట్‌ బ్లెయిర్‌ వరకు ఓ ఊహాజనిత రేఖ గీస్తే, ఆ రేఖ పైభాగం.. అంటే చెన్నై నుంచి కళింగపట్నం సరిహద్దు వరకు ఉన్న సముద్రాన్ని పశ్చిమ మధ్య బంగాళాఖాతంగా గుర్తించారు. చెన్నై నుంచి శ్రీలంక దిగువ ప్రాంతం వరకు నైరుతి బంగాళాఖాతంగా పిలుస్తారు. 
  • పోర్ట్‌ బ్లెయిర్‌ సమీపంలోని ప్రాంతాన్ని ఆగ్నేయ బంగాళాఖాతమని, పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి సమాంతరంగా తూర్పు వైపునున్న భాగాన్ని తూర్పు మధ్య బంగాళాఖాతంగా పిలుస్తారు. 
  • ఇక కోల్‌కతా నుంచి కళింగపట్నం వరకు వాయవ్య బంగాళాఖాతంగా, సుందర్బన్‌ మడ అడవుల నుంచి బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌ వరకు ఉన్న భాగాన్ని ఈశాన్య బంగాళాఖాతంగా విభజించారు.

ఈనాడు, విశాఖపట్నం

Tags :
Published : 29 Oct 2025 07:07 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని