బాధితులకు 25 కిలోల చొప్పున బియ్యం, నిత్యావసరాలు

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 30 Oct 2025 04:57 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మత్స్యకారులకు 50 కిలోల చొప్పున..

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవానిలంకలో పునరావాస కేంద్రంలో బాధితులతో కలిసి భోజనం చేస్తున్న కలెక్టర్‌ నాగరాణి

ఈనాడు, అమరావతి: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వరద ముంపునకు గురైన మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల చొప్పున బియ్యం, నిత్యావసరాల్ని ఉచితంగా పంపిణీ చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. పునరావాస కేంద్రాలకు వచ్చిన ఇతర కుటుంబాలకు కూడా 25 కిలోల చొప్పున బియ్యం అందించాలని సూచించింది. ఈ మేరకు రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ ఇన్‌ఛార్జ్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ నిత్యావసరాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌కు సూచించారు.

గుంటూరు జిల్లా అబ్బినేనిగుంటపాలెం వద్ద తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు ట్రాక్టర్‌పై వెళుతున్న కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, ఆర్డీఓ శ్రీనివాసరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు