గజ విన్యాసం

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 30 Oct 2025 05:13 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

జనావాసాల్లోకి వచ్చే ఏనుగుల గుంపును అడవుల్లోకి తరిమికొట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తీసుకొచ్చింది. వీటిని చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం ముసలమడుగు కేంద్రానికి తరలించి వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోని అటవీశాఖ అధికారులకు ఏనుగుల ప్రవర్తన, అలవాట్లు, ఆహారం, వ్యవహారశైలి తదితరాలపై ప్రస్తుతం ఈ కేంద్రంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కుంకీ ఏనుగులు బుధవారం అధికారుల ఎదుట ఇలా విన్యాసాలు చేశాయి. బల్లలపై నిల్చొని, కలప దుంగలు మోస్తూ, ఫుట్‌బాల్‌ ఆడుతూ అలరించాయి.   

ముచ్చటగా స్టూల్‌పై నిల్చుందే..

నేనూ ఫుట్‌బాల్‌ ఆడుతా..

ఈనాడు, చిత్తూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని