ఎప్పుడు... ఏ రాయి పడుతుందో!

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 30 Oct 2025 07:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

పట్టాలపై పడిన బండరాళ్లను తొలగిస్తున్న రైల్వే సిబ్బంది

ఈనాడు-విశాఖపట్నం, న్యూస్‌టుడే-అనంతగిరి గ్రామీణం: భారతీయ రైల్వేకు సరకు రవాణా ద్వారా అత్యధిక ఆదాయం తీసుకొస్తున్న మార్గాల్లో వాల్తేరు డివిజన్‌లోని కొత్తవలస-కిరండూల్‌ (కేకే) లైను ఒకటి. ఇక్కడ తరచూ ట్రాక్‌పైకి కొండ చరియలు, బండరాళ్లు జారిపడుతుంటాయి. ‘మొంథా’ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి సమీపంలో ట్రాక్‌ మీది నుంచి వరద ప్రవహించింది. బండరాళ్లు పడ్డాయి. ఇటు రోజూ వెళ్లే 19 రైళ్లు నిలిచిపోతే రైల్వే రోజుకు రూ.2 కోట్ల ఆదాయం కోల్పోతుంది. 

రిలీఫ్‌ ట్రైన్‌తో

ప్రమాదాలు సంభవిస్తే వెంటనే పునరుద్ధరణ పనులకు ప్రత్యేక ఇంజినీరింగ్‌ బృందాన్ని వాల్తేరు డివిజన్‌ సిద్ధం చేస్తుంది. యాక్సిడెంట్‌ రిలీఫ్‌ ట్రైన్‌ను పంపుతారు. అందులో 120 టన్నుల బరువును ఎత్తే క్రేన్లు, భారీ యంత్రాలు, మట్టి తవ్వే పరికరాలు ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని