వెలిగొండ టన్నెల్‌ నుంచి 250 మంది కార్మికులను తరలించాం: మంత్రి నిమ్మల

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 30 Oct 2025 05:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, అమరావతి: భారీ వర్షం కారణంగా వెలిగొండ ఫీడర్‌ కెనాల్‌కు గండిపడి, టన్నెల్లోకి 9 కి.మీ. నీరు చేరడంతో అక్కడ పనిచేస్తున్న 250 మంది కార్మికులను పడవల ద్వారా సురక్షితంగా తరలించామని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వైకాపా ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేశామంటూ హడావిడి చేసిందని, అప్పట్లో ఫీడర్‌ కెనాల్‌ పనులను అస్తవ్యస్తంగా వదిలేసిందని పేర్కొన్నారు. సచివాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టు 2026 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకే టన్నెల్‌లోకి చేరిన నీటిని తొలగించి, వెంటనే పనులు చేపట్టేలా ఆదేశించినట్లు చెప్పారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు బుధవారం సాయంత్రానికి 1.20 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో.. లక్ష క్యూసెక్కులు దిగవకు వదులుతున్నట్లు చెప్పారు. దిగువన ప్రకాశం, బాపట్ల కలెక్టర్లకు సమాచారమిచ్చి, అక్కడి గ్రామాలను అప్రమత్తం చేశామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని