గ్రామాల్లో మళ్లీ సాధారణ పరిస్థితులు రావాలి
పారిశుద్ధ్య పనులకు మొబైల్ బృందాలు
తాగునీటికి ఇబ్బందుల్లేకుండా చర్యలు
రహదారుల పునరుద్ధరణకు తక్షణ ఏర్పాట్లు
అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఆదేశం

ఈనాడు, అమరావతి: తుపాను ప్రభావిత గ్రామాల్లో సూపర్ క్లోరినేషన్, శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టి పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అధికారులను ఆదేశించారు. పాడైన రహదారులకు ప్రాధాన్య క్రమంలో మరమ్మతులు చేయాలని సూచించారు. ఈ విషయంలో అధికారులు యుద్ధప్రాతిపదికన పని చేయాలని అన్నారు. మొంథా తుపాను అనంతరం గ్రామాల్లో తీసుకోవలసిన చర్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ తుపానును 1,583 గ్రామాలు ప్రభావితమైనట్లుగా అధికారులు వివరించారు. పారిశుద్ధ్య సిబ్బందిని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచామని వివరించారు. 38 చోట్ల రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని, మరో 125 చోట్ల రహదారులకు గుంతలు పడ్డాయని ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రక్షిత తాగునీటి పథకాల ట్యాంకుల వద్ద క్లోరినేషన్ చేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు.
తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి
‘తాగునీటి పథకాల ద్వారా నీటి సరఫరాకు ఇబ్బందులు ఉంటే తక్షణమే ప్రత్యామ్నాయం చూడాలి. గ్రామాల్లో 21,055 మంది కార్మికులతో మొబైల్ శానిటేషన్ బృందాలు సిద్ధం చేసి పారిశుద్ధ్యం మెరుగయ్యేలా చూడాలి. తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్య ఆరోగ్యశాఖతో సమన్వయం చేసుకుని వ్యాధులు ప్రబలకుండా చూడాలి. గ్రామాల్లో మళ్లీ సాధారణ పరిస్థితి వచ్చే వరకు పూర్తిగా దృష్టి సారించాలి.
జిల్లా పరిషత్ సీఈవోలు, ఛైర్మన్లు, డీపీవోలు తదితర అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండి గ్రామాల్లో పరిస్థితిని చక్కదిద్దాలి. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సమన్వయం చేసుకోవాలి’ అని ఉపముఖ్యమంత్రి ఆదేశించారు.
అత్యవసర బృందాలతో ప్రజలకు సేవలు అందించాలి
‘రాష్ట్ర వ్యాప్తంగా 1,158 మొబైల్ శానిటేషన్ బృందాలు ఏర్పాటు చేసి పారిశుద్ధ్య పనులు మొదలు పెట్టాలి. తుపానుతో దెబ్బతిన్న 779 రోడ్లు, 89 వంతెనలు, 473 కల్వర్టుల పునరుద్ధరణకు తక్షణమే చర్యలు చేపట్టాలి. పాక్షికంగా ధ్వంసమైన రోడ్లు, వంతెనలను జిల్లా స్థాయి నిధులతో రిపేర్లు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి’ అని అధికారులను పవన్కల్యాణ్ ఆదేశించారు.
తుపాను బలహీనపడ్డా పునరావాస కేంద్రాల్లోనే ఉంచాలి
‘తుపాను బలహీనపడ్డా పునరావాస కేంద్రాల్లో ఉన్న వారిని బుధవారం కూడా అక్కడే ఉంచాలి. తీవ్ర గాలులు, వర్షం ఉన్నందున వారిని ఇళ్లకు పంపడం సరికాదు’ అని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అధికారులకు సూచించారు. మంగళవారం అర్ధరాత్రి తుపాను తీరం దాటిన నేపథ్యంలో రాత్రంగా కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లా కలెక్టర్ల పేషీ నుంచి సమాచారం తెలుసుకుని ఉప ముఖ్యమంత్రి సూచనలు, సలహాలు వారికి అందజేశామని ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

టీచరమ్మా ఇది తగునా?
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఆ ఉపాధ్యాయురాలు వారితో కాళ్లు పట్టించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసింది. - 
                                    
                                        

ప్రపంచకప్ గెలిచిన జట్టులో మా అమ్మాయి ఉండటంపై గర్విస్తున్నాం
మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలవడం, అందులో తమ కుమార్తె భాగస్వామ్యం కావడంపై గర్వపడుతున్నామని భారత మహిళల జట్టు క్రీడాకారిణి శ్రీచరణి తల్లిదండ్రులు నల్లపురెడ్డి చంద్రశేఖర్రెడ్డి, రేణుక తెలిపారు. - 
                                    
                                        

జాతీయ ఆరోగ్య మిషన్ అమలుపై సీఆర్ఎం బృందం ఆరా
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కార్యక్రమాల అమలు తీరు పరిశీలనకు 12 మందితో కూడిన కామన్ రివ్యూ మిషన్ (సీఆర్ఎం) బృందం సోమవారం రాష్ట్రానికి వచ్చింది. - 
                                    
                                        

తీరు మార్చుకోకపోతే బుద్ధి చెబుతాం
వైకాపా నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి మహిళలపై మూర్ఖపు వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఆయన తన తీరును మార్చుకోకపోతే బుద్ధి చెబుతామని తెదేపా ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ హెచ్చరించారు. - 
                                    
                                        

వైకాపా నాయకులు భూమి ఆక్రమించారు
వైకాపా మద్దతుదారులు తన స్థలాన్ని తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గుంటూరు జిల్లా గోరంట్లకు చెందిన యశోద వాపోయారు. ఈ మేరకు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. - 
                                    
                                        

రూ.50 కోట్లు దాటిన బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ డిపాజిట్లు
ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంస్థకు అనుబంధంగా ఉన్న బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ తొలిసారిగా డిపాజిట్ల సేకరణలో రూ.50 కోట్ల మైలురాయిని దాటింది. - 
                                    
                                        

‘ఉపాధి’లో మెరిసిన రాష్ట్రం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మెరిసింది. 2025-26లో ఇప్పటివరకు పనిదినాల వినియోగంలో దేశంలో మూడో స్థానంలో నిలిచింది. - 
                                    
                                        

ప్రభుత్వాసుపత్రిలో దౌర్జన్యంపై కేసు.. ఏ1గా జోగి భార్య శకుంతల, ఏ2, ఏ3గా కుమారులు
పోలీసులను దౌర్జన్యంగా తోసేసి.. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అద్దాలు పగలగొట్టిన ఘటనపై వైకాపా నేత జోగి రమేష్ భార్య, ఇద్దరు కుమారులు, మరికొందరిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. - 
                                    
                                        

5 వేల హెక్టార్లలో బీచ్శాండ్ లీజులకు ప్రయత్నాలు
అణుధార్మికతతో కూడిన అరుదైన ఖనిజాలు ఉండే బీచ్శాండ్ తవ్వకాల కోసం మరో 5 వేల హెక్టార్లలో లీజులు పొందేందుకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ప్రయత్నాలు చేస్తోంది. - 
                                    
                                        

పోలవరం పనులే చేస్తున్నప్పుడు విద్యుత్తు సబ్స్టేషన్ల పనులు పూర్తి చేయలేరా?
విద్యుత్తు లైన్లు.. 132, 140, 400కేవీ వంటి సబ్స్టేషన్ల పనులనూ సకాలంలో పూర్తి చేయలేరా? అని ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ(పీయూసీ) ట్రాన్స్కో అధికారులను నిలదీసింది. - 
                                    
                                        

‘రుణాల పంపిణీ.. డిజిటలైజేషన్లో భారీ అక్రమాలున్నాయ్’
వైకాపా హయాం(2019-24)లో సహకార వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని ప్రత్యేక సభా సంఘం అభిప్రాయపడింది. 2019-24 మధ్య ఆప్కాబ్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, పీఏసీఎస్లలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన సభాసంఘం.. అసెంబ్లీ కమిటీ హాలులో సోమవారం సమావేశమైంది. - 
                                    
                                        

ఇటలీ వాసి.. గోరింటకు మురిసి
విశ్వశాంతి కాంక్షిస్తూ ఇటలీ దేశీయుడైన జాన్ సైకిల్పై ప్రపంచ దేశాలను చుట్టేస్తున్నారు. ఇప్పటికే స్పెయిన్, ఫ్రాన్స్, తుర్కియే, ఇండోనేసియా, జర్మనీ తదితర దేశాల్లో యాత్ర పూర్తిచేశారు. - 
                                    
                                        

ఈ దండలను ఎంచక్కా తినేయొచ్చు!
పాయసంలోకి కమ్మని రుచిని ఇచ్చేది జీడిపప్పు. అదే జీడిపప్పుతో చేసిన దండలను నూతన వధూవరులు, రాజకీయ నాయకుల మెడలో వేస్తే ప్రత్యేకమే కదా. - 
                                    
                                        

కోటి కాంతుల అఖండ జ్యోతి
కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ములగపూడిలో ఏటా కార్తిక పౌర్ణమి రోజు కోదండరాముడి తెప్పోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. - 
                                    
                                        

విజయనగరంలోనూ డబ్బావాలా..
వ్యక్తిగత పని అనో, ఉద్యోగమనో, వ్యాపారమనో చాలా మంది ఉదయం నిద్ర లేచింది మొదలు ఉరుకులు పరుగులు పెడుతుంటారు. ఓ వైపు పాఠశాలలకు పిల్లల్ని సిద్ధం చేస్తూనే వారికి అల్పాహారం వండుతూ తీరిక లేకుండా ఉంటారు. - 
                                    
                                        

వ్యర్థానికి అర్థం.. చిన్నారులకు ఆహ్లాదం
ఎందుకూ పనికి రావని పక్కన పడేసే వాహనాల టైర్లను సరికొత్తగా వినియోగించవచ్చని నిరూపించారు గుంటూరు లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు. - 
                                    
                                        

అబ్బో.. ఎంత పొడగరో!
తిరుమలలో ఓ విదేశీ మహిళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 6 అడుగుల 10 అంగుళాల ఎత్తు ఉన్న శ్రీలంకకు చెందిన నెట్బాల్ ప్లేయర్ తార్జిని శివలింగం సోమవారం సంప్రదాయ వస్త్రధారణతో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. - 
                                    
                                        

వేద పాఠశాల నిర్మాణానికి… 2 ఎకరాల భూమి.. 2 కోట్ల నగదు
పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారంలో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వేద పాఠశాల నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. - 
                                    
                                        

మా పార్టీ ఇచ్చిన స్క్రిప్టే చదివాను.. వాస్తవంగా ఏం జరిగిందో తెలియదు: శ్యామల
కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటనకు అసలు కారణాలు తనకు తెలియవని.. వైకాపా ప్రతినిధులు ఇచ్చిన స్క్రిప్టే చదివానని ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల తేల్చిచెప్పారు. - 
                                    
                                        

ముక్కంటికి కార్తిక హారతి
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండో కార్తిక సోమవారాన్ని పురస్కరించుకొని ఆలయ పుష్కరిణి వద్ద నిర్వహించిన లక్ష దీపోత్సవం కనుల పండువగా జరిగింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ..జట్టులో ద్రవిడ్ కుమారుడు
 - 
                        
                            

ఖర్గేజీ.. రాహుల్ పెళ్లి ఎప్పుడో చెప్పండి: భాజపా సెటైర్లు
 - 
                        
                            

మంత్రి అజారుద్దీన్కు శాఖల కేటాయింపు
 - 
                        
                            

నాకు ఏం జరిగిందో గుర్తులేదా..? థరూర్ను హెచ్చరించిన భాజపా నేత
 - 
                        
                            

లాలూ తాతలు దిగొచ్చినా.. ఆ సొమ్ము దోచుకోలేరు: అమిత్ షా
 - 
                        
                            

చాట్జీపీటీ గో ఫ్రీ ప్లాన్ .. ఎలా పొందాలంటే?
 


