టెట్కు ఇన్ సర్వీసు టీచర్ల సన్నద్ధం!
3 వేల మందికి పైగా దరఖాస్తు
ఏ హోదాలో ఉంటే ఆ పేపర్ రాస్తే సరిపోతుంది
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉపాధ్యాయులకు అవకాశం కల్పించిన విద్యాశాఖ
ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) రాసేందుకు ఇన్ సర్వీసు టీచర్లు దరఖాస్తులు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. 2010కి ముందు నియమితులైన టీచర్లకూ టెట్ రాసేందుకు పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించింది. నవంబరు 23 వరకు దరఖాస్తుల సమర్పణకు గడువిచ్చింది. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయించి... మరోపక్క ఆసక్తిగల వారికి టెట్ రాసే వెసులుబాటును కల్పించింది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగాల్లో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబరు 1న తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి రెండేళ్ల వ్యవధిలో ఉత్తీర్ణులు కావాలని స్పష్టంచేసింది. ఐదేళ్లలో పదవీ విరమణ చేయబోయే వారికి టెట్ అవసరం లేదని, వారు పదోన్నతి పొందాలంటే మాత్రం పాసవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ రాసే అవకాశమిస్తూ విద్యాశాఖ ఈ నెల 24న నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం సాయంత్రం వరకు 28,121 మంది టెట్కు దరఖాస్తు చేయగా.. వీరిలో ఇన్ సర్వీసు టీచర్లు 3,461 మంది ఉన్నారు. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసినా ప్రయోజనం ఉండకపోవచ్చని, కేంద్ర ప్రభుత్వం.. విద్యాహక్కు చట్టంలో సవరణ చేస్తే తప్ప ఉపశమనం కలగదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
సైన్సు సబ్జెక్టుల్లో సిలబస్ సవాల్..
రాష్ట్రంలో 2010కి ముందు డీఎస్సీల ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు ఇప్పుడు సిలబస్ సవాల్గా మారిందని కొందరు టీచర్లు పేర్కొంటుండగా.. ప్రస్తుతం పాఠశాలల్లో బోధిస్తున్నందున సిలబస్ మార్పు పెద్ద సమస్య కాదని మరికొందరు వెల్లడిస్తున్నారు.
- స్కూల్ అసిస్టెంట్లలో ఎక్కువ మంది ఏదో ఒక సబ్జెక్టునే 6-10 తరగతులకు బోధిస్తున్నారు. టెట్కు అన్ని సబ్జెక్టులనూ చదవాల్సిన పరిస్థితి.
 - జీవశాస్త్ర ఉపాధ్యాయులకు వారి సబ్జెక్టు సంబంధించి టెట్లో 20 మార్కులకే ప్రశ్నలు ఉంటాయి. వీటితో పాటు మొత్తం 150 మార్కుల్లో పిల్లల అభివృద్ధి, పెడగాజీ 30 మార్కులకు, మాతృభాష 30, ఆంగ్ల భాష 30, గణితం 20, భౌతిక, రసాయన శాస్త్రాల నుంచి 20 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.
 - గణితం ఉపాధ్యాయులకూ ఇదే మాదిరిగా ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రస్తుతం పాఠశాలల్లో పని చేస్తున్న గణిత ఉపాధ్యాయులు ఆ ఒక్క సబ్జెక్టునే కొన్నేళ్లుగా బోధిస్తున్నారు. ఇప్పుడు భాషలతో పాటు సైన్సు సబ్జెక్టులకూ సన్నద్ధం కావాల్సి ఉంది.
 - సాంఘికశాస్త్రం, భాషా ఉపాధ్యాయులకు 60 మార్కులకు ఆయా సబ్జెక్టుల నుంచే ప్రశ్నలు ఇస్తారు. దీంతో వీరు బోధిస్తున్న సబ్జెక్టుల నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
 
పదోన్నతిలో ఉన్నదే..
- 2010కి ముందు డీఎస్సీల ద్వారా ఉద్యోగాల్లో చేరిన టీచర్లు ప్రస్తుతం ఏ హోదాలో ఉన్నారో ఆ హోదాకు సంబంధించిన టెట్ పేపర్ రాయాల్సి ఉంటుంది. ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందిన వారు వాటికి సంబంధించిన టెట్ పేపర్ రాస్తే సరిపోతుంది.
 - ఇన్ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు అకడమిక్ అర్హత మార్కుల్లో సడలింపునిచ్చింది.
 - టెట్ అర్హతల్లో ఎలాంటి సడలింపులూ లేవు. ఓసీలకు 60%, బీసీలకు 50%, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు 40%గా ఎన్సీటీఈ నిర్ణయించారు.
 
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

టీచరమ్మా ఇది తగునా?
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఆ ఉపాధ్యాయురాలు వారితో కాళ్లు పట్టించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసింది. - 
                                    
                                        

ప్రపంచకప్ గెలిచిన జట్టులో మా అమ్మాయి ఉండటంపై గర్విస్తున్నాం
మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలవడం, అందులో తమ కుమార్తె భాగస్వామ్యం కావడంపై గర్వపడుతున్నామని భారత మహిళల జట్టు క్రీడాకారిణి శ్రీచరణి తల్లిదండ్రులు నల్లపురెడ్డి చంద్రశేఖర్రెడ్డి, రేణుక తెలిపారు. - 
                                    
                                        

జాతీయ ఆరోగ్య మిషన్ అమలుపై సీఆర్ఎం బృందం ఆరా
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కార్యక్రమాల అమలు తీరు పరిశీలనకు 12 మందితో కూడిన కామన్ రివ్యూ మిషన్ (సీఆర్ఎం) బృందం సోమవారం రాష్ట్రానికి వచ్చింది. - 
                                    
                                        

తీరు మార్చుకోకపోతే బుద్ధి చెబుతాం
వైకాపా నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి మహిళలపై మూర్ఖపు వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఆయన తన తీరును మార్చుకోకపోతే బుద్ధి చెబుతామని తెదేపా ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ హెచ్చరించారు. - 
                                    
                                        

వైకాపా నాయకులు భూమి ఆక్రమించారు
వైకాపా మద్దతుదారులు తన స్థలాన్ని తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గుంటూరు జిల్లా గోరంట్లకు చెందిన యశోద వాపోయారు. ఈ మేరకు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. - 
                                    
                                        

రూ.50 కోట్లు దాటిన బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ డిపాజిట్లు
ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంస్థకు అనుబంధంగా ఉన్న బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ తొలిసారిగా డిపాజిట్ల సేకరణలో రూ.50 కోట్ల మైలురాయిని దాటింది. - 
                                    
                                        

‘ఉపాధి’లో మెరిసిన రాష్ట్రం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మెరిసింది. 2025-26లో ఇప్పటివరకు పనిదినాల వినియోగంలో దేశంలో మూడో స్థానంలో నిలిచింది. - 
                                    
                                        

ప్రభుత్వాసుపత్రిలో దౌర్జన్యంపై కేసు.. ఏ1గా జోగి భార్య శకుంతల, ఏ2, ఏ3గా కుమారులు
పోలీసులను దౌర్జన్యంగా తోసేసి.. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అద్దాలు పగలగొట్టిన ఘటనపై వైకాపా నేత జోగి రమేష్ భార్య, ఇద్దరు కుమారులు, మరికొందరిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. - 
                                    
                                        

5 వేల హెక్టార్లలో బీచ్శాండ్ లీజులకు ప్రయత్నాలు
అణుధార్మికతతో కూడిన అరుదైన ఖనిజాలు ఉండే బీచ్శాండ్ తవ్వకాల కోసం మరో 5 వేల హెక్టార్లలో లీజులు పొందేందుకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ప్రయత్నాలు చేస్తోంది. - 
                                    
                                        

పోలవరం పనులే చేస్తున్నప్పుడు విద్యుత్తు సబ్స్టేషన్ల పనులు పూర్తి చేయలేరా?
విద్యుత్తు లైన్లు.. 132, 140, 400కేవీ వంటి సబ్స్టేషన్ల పనులనూ సకాలంలో పూర్తి చేయలేరా? అని ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ(పీయూసీ) ట్రాన్స్కో అధికారులను నిలదీసింది. - 
                                    
                                        

‘రుణాల పంపిణీ.. డిజిటలైజేషన్లో భారీ అక్రమాలున్నాయ్’
వైకాపా హయాం(2019-24)లో సహకార వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని ప్రత్యేక సభా సంఘం అభిప్రాయపడింది. 2019-24 మధ్య ఆప్కాబ్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, పీఏసీఎస్లలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన సభాసంఘం.. అసెంబ్లీ కమిటీ హాలులో సోమవారం సమావేశమైంది. - 
                                    
                                        

ఇటలీ వాసి.. గోరింటకు మురిసి
విశ్వశాంతి కాంక్షిస్తూ ఇటలీ దేశీయుడైన జాన్ సైకిల్పై ప్రపంచ దేశాలను చుట్టేస్తున్నారు. ఇప్పటికే స్పెయిన్, ఫ్రాన్స్, తుర్కియే, ఇండోనేసియా, జర్మనీ తదితర దేశాల్లో యాత్ర పూర్తిచేశారు. - 
                                    
                                        

ఈ దండలను ఎంచక్కా తినేయొచ్చు!
పాయసంలోకి కమ్మని రుచిని ఇచ్చేది జీడిపప్పు. అదే జీడిపప్పుతో చేసిన దండలను నూతన వధూవరులు, రాజకీయ నాయకుల మెడలో వేస్తే ప్రత్యేకమే కదా. - 
                                    
                                        

కోటి కాంతుల అఖండ జ్యోతి
కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ములగపూడిలో ఏటా కార్తిక పౌర్ణమి రోజు కోదండరాముడి తెప్పోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. - 
                                    
                                        

విజయనగరంలోనూ డబ్బావాలా..
వ్యక్తిగత పని అనో, ఉద్యోగమనో, వ్యాపారమనో చాలా మంది ఉదయం నిద్ర లేచింది మొదలు ఉరుకులు పరుగులు పెడుతుంటారు. ఓ వైపు పాఠశాలలకు పిల్లల్ని సిద్ధం చేస్తూనే వారికి అల్పాహారం వండుతూ తీరిక లేకుండా ఉంటారు. - 
                                    
                                        

వ్యర్థానికి అర్థం.. చిన్నారులకు ఆహ్లాదం
ఎందుకూ పనికి రావని పక్కన పడేసే వాహనాల టైర్లను సరికొత్తగా వినియోగించవచ్చని నిరూపించారు గుంటూరు లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు. - 
                                    
                                        

అబ్బో.. ఎంత పొడగరో!
తిరుమలలో ఓ విదేశీ మహిళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 6 అడుగుల 10 అంగుళాల ఎత్తు ఉన్న శ్రీలంకకు చెందిన నెట్బాల్ ప్లేయర్ తార్జిని శివలింగం సోమవారం సంప్రదాయ వస్త్రధారణతో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. - 
                                    
                                        

వేద పాఠశాల నిర్మాణానికి… 2 ఎకరాల భూమి.. 2 కోట్ల నగదు
పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారంలో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వేద పాఠశాల నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. - 
                                    
                                        

మా పార్టీ ఇచ్చిన స్క్రిప్టే చదివాను.. వాస్తవంగా ఏం జరిగిందో తెలియదు: శ్యామల
కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటనకు అసలు కారణాలు తనకు తెలియవని.. వైకాపా ప్రతినిధులు ఇచ్చిన స్క్రిప్టే చదివానని ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల తేల్చిచెప్పారు. - 
                                    
                                        

ముక్కంటికి కార్తిక హారతి
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండో కార్తిక సోమవారాన్ని పురస్కరించుకొని ఆలయ పుష్కరిణి వద్ద నిర్వహించిన లక్ష దీపోత్సవం కనుల పండువగా జరిగింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

కలలు కనడం ఎప్పుడూ ఆపొద్దు: హర్మన్ ప్రీత్ కౌర్
 - 
                        
                            

పెట్టుబడుల విషయంలో పూర్తిగా సహకరిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
 - 
                        
                            

అదరగొట్టిన ఎస్బీఐ.. లాభం రూ.20,160 కోట్లు
 - 
                        
                            

అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ..జట్టులో ద్రవిడ్ కుమారుడు
 - 
                        
                            

ఖర్గేజీ.. రాహుల్ పెళ్లి ఎప్పుడో చెప్పండి: భాజపా సెటైర్లు
 - 
                        
                            

మంత్రి అజారుద్దీన్కు శాఖల కేటాయింపు
 


