త్వరలో ఆర్యవైశ్య కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ ఏర్పాటు

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 31 Oct 2025 06:17 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత

ఈనాడు, అమరావతి: ఆర్యవైశ్యులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు త్వరలో రాష్ట్ర ఆర్యవైశ్య కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీని ఏర్పాటు చేయబోతున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. ఈ సొసైటీ ద్వారా వారికి రుణ సదుపాయం కల్పించి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. కన్యకాపరమేశ్వరీ అమ్మవారు జన్మించిన పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గ్రామానికి వాసవీ పెనుగొండ గ్రామంగా త్వరలో పేరు మార్చనున్నామని తెలిపారు. త్వరలో ఈ జీవో రానుందని పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఛైర్మన్‌ డూండీ రాకేశ్‌ ఆధ్వర్యంలో వరల్డ్‌ ఆర్యవైశ్య మహాసభ సంఘం, ఏపీ ఆర్యవైశ్య మహాసభ, ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి, వాసవీ ఫౌండేషన్, ఐవీఎఫ్‌ ప్రతినిధులు గురువారం కలిశారు.

రాష్ట్రంలోని వైశ్యులను ఆర్య, శెట్టి, గుప్త కోమటి, వేగిన, బుక్క, జనపశెట్టి అనే పేర్లతో సంభోదిస్తున్నారని, వారందరినీ ఆర్యవైశ్యులుగా ప్రభుత్వం గుర్తిస్తూ చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందించారు. దీన్ని ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఆర్యవైశ్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటులో ఆర్యవైశ్యులకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు.

Tags :
Published : 31 Oct 2025 05:57 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని