సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లలో ప్యాసింజర్‌ హోల్డింగ్‌ ఏరియాలు

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 31 Oct 2025 05:57 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, గుంటూరుల్లోనూ.. 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లలో ప్యాసింజర్‌ హోల్డింగ్‌ ఏరియాలను అభివృద్ధి చేయనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 76 రైల్వేస్టేషన్లలో వీటిని నిర్మించేందుకు రైల్వేశాఖ గురువారం ఆమోదం తెలిపింది. ద.మ.రైల్వేజోన్‌ పరిధిలో ఏపీలోని విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు రైల్వేస్టేషన్లలోనూ ఏర్పాటు చేయనున్నారు. పండగల సమయంలో రైల్వేస్టేషన్లలో భారీ రద్దీని నియంత్రించేందుకు ప్యాసింజర్‌ హోల్డింగ్‌ ఏరియాలు దోహదం చేస్తాయి. మహాకుంభమేళా సమయంలో దిల్లీ స్టేషన్‌లో తొక్కిసలాట ఘటన అనంతరం అక్కడ ‘యాత్రి సువిధ కేంద్ర’ పేరిట దీనిని అభివృద్ధి చేశారు. ఇందులో టికెట్‌ కౌంటర్లతోపాటు ఒకేసారి వందల మంది ప్రయాణికులు వేచి ఉండేలా వసతులు కల్పించారు. అదే మోడల్‌ను దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వేస్టేషన్లలో ఏర్పాటుచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ అధికారుల్ని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు