58 మంది క్లాస్‌-3, 4 ఉద్యోగులు తెలంగాణకు

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 31 Oct 2025 06:14 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

సొంత రాష్ట్రానికి పంపుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: రాష్ట్రవిభజన సమయంలో వివిధ కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడంతో ఇక్కడ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన 58 మంది క్లాస్‌ 3, క్లాస్‌ 4 ఉద్యోగుల్ని వారి సొంత రాష్ట్రానికి పంపిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో రాష్ట్ర విభజన సమయంలో అవగాహన లేకపోవడంతో తెలంగాణ ఆప్షన్‌ ఎంచుకోనివారు, కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందినవారు తదితరులున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన 698 మంది తెలంగాణ ఉద్యోగుల్ని 2021లో జీఓ 37 ప్రకారం ఇప్పటికే సొంత రాష్ట్రానికి పంపించారు. వారిలాగే తమకూ సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని మిగతావారు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరారు.

వారిని కొన్ని షరతులకు లోబడి తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించడంతో 58 మందిని సొంత రాష్ట్రానికి పంపేందుకు అనుమతిస్తూ సీఎస్‌ విజయానంద్‌ ఉత్తర్వులు జారీచేశారు. వారంతా సొంత రాష్ట్రానికి వెళ్లాలంటే తెలంగాణ ప్రభుత్వం విధించిన షరతులకు లోబడి, అంగీకారపత్రంపై సంతకం చేయాలని, అందుకు అంగీకరించిన వారిని రిలీవ్‌ చేయాలని సంబంధిత విభాగాధిపతుల్ని ఆయన ఆదేశించారు. వారు ఏపీకి కేటాయించే నాటికి/ కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందే సమయానికి ఏ కేటగిరీ పోస్టుల్లో పనిచేస్తున్నారో దానిలో చేరేందుకు అంగీకరించాలన్నది మొదటి షరతు. సంబంధిత  క్యాడర్‌లో చివరి ర్యాంక్‌లో చేరేందుకు ఒప్పుకోవాలన్నది తెలంగాణ ప్రభుత్వం విధించిన మరో షరతు.

Tags :
Published : 31 Oct 2025 05:58 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని