తుపాను నష్టం వివరాలు.. మీరే ప్రభుత్వానికి పంపొచ్చు!

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 31 Oct 2025 06:06 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మనమిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌లో వివరాల నమోదు ఇలా..

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: మొంథా తుపానుతో జరిగిన నష్టాన్ని బాధితులే స్వయంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశాన్ని కూటమి సర్కారు మనమిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌తో కల్పించింది. ఇప్పటికే మనమిత్ర వాట్సప్‌ నంబరు సెల్‌ఫోన్లలో సేవ్‌ చేసుకున్న వారికి ‘తుపాను ప్రభావంతో మీకు ఎలాంటి సమస్య ఎదురైనా తెలియజేయగలరు’ అనే సంక్లిప్త సందేశాలు వచ్చాయి. దాన్ని తెరవగానే పేరు, జిల్లా, మండలం, సచివాలయం, నష్టం వివరణ, నష్టానికి సంబంధించి ఫొటోను 25 ఎంబీలోపు సైజ్‌తో అప్‌లోడ్‌ చేయాలని సూచిస్తోంది. డాక్యుమెంట్‌ అప్‌లోడ్‌ చేస్తే అది నేరుగా సంబంధిత ప్రభుత్వ శాఖల పరిశీలనకు వెళ్తుందని అధికారులు తెలిపారు.

Tags :
Published : 31 Oct 2025 06:03 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు