చేపా చేపా.. ఎందుకు కుళ్లావే!

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 31 Oct 2025 06:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

పాడైపోగా మిగిలిన ఎండు చేపలను ఆరబెడుతూ..

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులోని ఎండు చేపల మార్కెట్‌ వ్యాపారులు మొంథా తుపాను దెబ్బకు కుదేలయ్యారు. వర్షాల కారణంగా ఎండు చేపల నిల్వలు గోదాములకే పరిమితమయ్యాయి. వీటితో పాటు మార్కెట్లోని 70 దుకాణాల్లో నిల్వ చేసిన సరకు తేమ వాతావరణంతో కుళ్లి, పురుగులు పట్టడంతో భారీనష్టం వాటిల్లింది. ఎండు చేపలను కాకినాడ, చెన్నై, త్రివేండ్రం నుంచి రైళ్లలో నెల్లూరుకు తరలిస్తారు. ఇక్కడి నుంచి వైఎస్సార్‌ కడప, చిత్తూరు, ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లాలకు ఎగుమతి చేస్తారు. మార్కెట్‌లో చేపలను ఎండబెట్టడానికి ప్లాట్‌ఫాంలు లేక నష్టపోతున్నట్లు వ్యాపారులు వాపోయారు. నిల్వ చేసిన ఎండు చేపల్లో 80 శాతం కుళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈనాడు నెల్లూరు, న్యూస్‌టుడే-పద్మావతి సెంటర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు