3 నుంచి గనుల సరిహద్దులు గుర్తింపు

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 01 Nov 2025 05:39 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

డి.హీరేహాళ్, రాయదుర్గం, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా డి.హీరేహాళ్‌ మండలం ఓబుళాపురం గ్రామ శివారులోని ఆరు గనులకు సంబంధించిన సరిహద్దులను ఈ నెల 3 నుంచి డ్రోన్‌ కెమెరాలతోపాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తిస్తామని మైన్స్‌ అండ్‌ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసచౌదరి తెలిపారు. సిద్ధాపురంలోని వై.మహాబలేశ్వరప్ప గనుల ప్రాంతాన్ని శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఓబుళాపురం గనుల సరిహద్దు వివాదాలపై 2010లో కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా... ఆ సమస్య ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల అధికారుల సమక్షంలో 2022లో పరిష్కారమైందన్నారు. ప్రస్తుతం ఆరు గనులకు సంబంధించి నెలకొన్న అంతర్గత సరిహద్దు సమస్యను తేల్చాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు విశ్రాంత న్యాయమూర్తి, జస్టిస్‌ సుదాంశ్‌ దునియా ఆధ్వర్యంలో కమిటీ నియామకమైందన్నారు. ఈ కమిటీ త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు