TTD: త్వరలో తితిదేలో శ్రీవారి వైద్యసేవ

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 01 Nov 2025 06:19 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న డాక్టర్ల సేవలు దేవస్థానం
ఆసుపత్రుల్లో అందుబాటులోకి..: ఈవో వెల్లడి

తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: శ్రీవారి సేవను మరింత బలోపేతం చేసేందుకు, దేవస్థానంలోని అన్ని వైద్యశాలల్లో శ్రీవారి వైద్యసేవను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో శుక్రవారం అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మంలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం శ్రీవారి సేవలకు అవకాశం కల్పిస్తున్న తరహాలోనే వైద్యనిపుణులు, సిబ్బందికి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొనే అవకాశం కల్పించాలని.. అవసరమైతే శిక్షణ అనంతరం వారి సేవలు వినియోగించుకొనేలా చూడాలన్నారు. ఇందుకు అవసరమైన ప్రత్యేక సెల్, విధివిధానాలు రూపొందించాలన్నారు. ముఖ్యంగా అశ్విని, ఆయుర్వేద, స్విమ్స్, బర్డ్, చిన్నపిల్లల ఆసుపత్రుల్లో వారి సేవలు వినియోగించుకోవాలని ఆయా విభాగాల డైరెక్టర్లకు ఈవో సూచించారు. ఎస్వీ గోసంరక్షణశాలలో గోసేవకు వీలుగానూ చర్యలు తీసుకోవాలన్నారు. చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, కన్యాకుమారి, బెంగళూరు తదితర ప్రాంతాల్లోని శ్రీవారి ఆలయాల్లో మొదటి విడతగా శ్రీవారి సేవను ప్రారంభించాలని, ఇందుకు అవసరమైన శిక్షణను త్వరలో ప్రారంభించాలని ఆదేశించారు.

Tags :
Published : 01 Nov 2025 06:17 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని