20 రోజుల్లో 26 శాతానికి..
రాష్ట్రంలో 20 రోజుల్లో కరోనా పాజిటివిటీ శాతం 26శాతానికి చేరింది. పరీక్షలు నిర్వహించిన వారిలో జనవరి 1న 0.57శాతం పాజిటివిటీ వస్తే అదే 20న అది 26.60 శాతంగా నమోదైంది. గత అయిదు రోజుల్లోనే పాజిటివిటీ శాతం
భారీగా పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేటు
గురువారం 12,615 కేసులు
అయిదుగురి మృతి
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 20 రోజుల్లో కరోనా పాజిటివిటీ శాతం 26శాతానికి చేరింది. పరీక్షలు నిర్వహించిన వారిలో జనవరి 1న 0.57శాతం పాజిటివిటీ వస్తే అదే 20న అది 26.60 శాతంగా నమోదైంది. గత అయిదు రోజుల్లోనే పాజిటివిటీ శాతం దాదాపు రెండింతలు పెరిగింది. ఈ నెల 15న 13.89శాతం ఉంటే 20న 26.60శాతం వచ్చింది. బుధవారం ఉదయం 9గంటల నుంచి గురువారం ఉదయం 9గంటల మధ్య 47,420 నమూనాలను పరీక్షిస్తే 12,615 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున అయిదు మంది 24 గంటల్లో కొవిడ్తో మృతి చెందారు.
19న ఉదయం నుంచి 20 ఉదయం వరకు 24గంటల్లో 3,674మంది కోలుకున్నారు. చిత్తూరులో అత్యధికంగా 2,338 కరోనా కేసులు రాగా, విశాఖలో 2,117, గుంటూరులో 1,066, విజయనగరంలో 1,039, నెల్లూరులో 1,012, అనంతపురంలో 951, కర్నూలులో 884, ప్రకాశంలో 853, కడపలో 685, తూర్పుగోదావరిలో 627, శ్రీకాకుళంలో 464, కృష్ణాలో 363, పశ్చిమగోదావరిలో 216 కేసులు బయటపడ్డాయి.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి కరోనా
ఈనాడు, దిల్లీ: కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి కరోనా వైరస్ సోకింది. కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో తనకు పాజిటివ్గా తేలినట్లు ఆయన గురువారం ఉదయం ట్విటర్ ద్వారా వెల్లడించారు. తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, అన్ని రకాల నిబంధనలు పాటిస్తూ హోం క్వారెంటైన్లో ఏకాంతంగా ఉంటున్నట్లు చెప్పారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా కూడా ఐసొలేషన్లోకి వెళ్లి, పరీక్ష చేయించుకోవాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల వేళ ‘జగన్మాయ’!
ఎన్నికల వేళ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం దిమ్మదిరిగే షాకిచ్చింది..! బుధవారం ఉదయం నుంచే సెల్ఫోన్కి వస్తున్న మెసేజ్లు చూసి ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
జగన్ జమానాలో.. ఆశా ‘నిరాశె’ౖ..!
ప్రజారోగ్యంలో కీలకంగా వ్యవహరించే ఆశా కార్యకర్తల బతుకులతో సీఎం జగన్ ఆడుకున్నారు. పని భారాన్ని పెంచి, వారితో వెట్టిచాకిరీ చేయించారు. తాత్కాలిక పద్ధతిలో పనిచేసే వీరికి సంక్షేమ పథకాలను దూరం చేశారు. -
జగన్ పంతం.. జలయజ్ఞ విధ్వంసం!
తడిచెమ్మ తగలని కృష్ణా డెల్టా చేలు బీడుపడ్డాయి. ‘కాలువ నీరెప్పుడు వస్తుందంటే చెప్పరు.. ఈ కష్టాల సాగు మావల్ల కాదు’ అంటూ గోదావరి రైతు పంట విరామం ప్రకటించాడు. -
ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారు
వివిధ రకాల స్కీములు పెట్టి ప్రజల జేబుల్ని కొల్లగొట్టే గొలుసుకట్టు కంపెనీల కథలెన్నో విన్నాం కదా? ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు.. రాష్ట్రంలో అదే తరహాలో వ్యవహరిస్తోంది. -
సంక్షిప్త వార్తలు
-
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి