కరోనాపై మన పోరు అపూర్వం
కరోనా మహమ్మారిపై పోరులో భారత్ సాగించిన ప్రస్థానం అపూర్వమని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చెప్పారు. శాస్త్రవేత్తలు, నిపుణులు చెబుతున్న జాగ్రత్తల్ని పాటించడం దేశ పవిత్ర కర్తవ్యంగా మారిందనీ, ఈ సంక్షోభమంతా ముగిసిపోయేవరకు దీనిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ల కార్యక్రమం భారత్ది
జాగ్రత్తలు పాటించడం దేశ కర్తవ్యంగా మారింది
జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి కోవింద్
దిల్లీ: కరోనా మహమ్మారిపై పోరులో భారత్ సాగించిన ప్రస్థానం అపూర్వమని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చెప్పారు. శాస్త్రవేత్తలు, నిపుణులు చెబుతున్న జాగ్రత్తల్ని పాటించడం దేశ పవిత్ర కర్తవ్యంగా మారిందనీ, ఈ సంక్షోభమంతా ముగిసిపోయేవరకు దీనిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. బుధవారం జరగనున్న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘‘కరోనా వచ్చిన మొదటి ఏడాదే సదుపాయాలు పెంచుకున్నాం. రెండో ఏడాది వ్యాక్సిన్లు తయారు చేసుకుని, ప్రపంచంలోనే అతిపెద్ద టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఇతర దేశాలకు సాయమందించాం. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందాం. ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సిబ్బంది అలుపెరుగని సేవలు అందించారు. రెండేళ్లయినా కరోనాతో పోరాటం ఇంకా అంతం కాలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు పాటించాలి. కరోనాకు రెండు టీకాలు రూపొందించడం దేశానికి గర్వకారణం. కఠిన సమయంలోనూ దేశ ప్రజలు పోరాటస్ఫూర్తి చాటారు. కరోనా ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోంది. యువత స్టార్టప్లతో అద్భుతాలు సృష్టిస్తోంది. బలమైన దేశం ఇప్పుడు ఆవిర్భవిస్తోంది. ఐక్యతను, ఒకే దేశం అనే స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఏటా గణతంత్ర దినోత్సవం జరుపుకొంటాం. కరోనా కారణంగా ఈసారి వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నప్పటికీ.. స్ఫూర్తి మాత్రం ఎప్పటిలాగే బలంగా ఉంది. మనందరిలో ఉమ్మడిగా ఉన్న భారతీయతను పండగలా జరుపుకొనేందుకు గణతంత్ర వేడుక ఒక తరుణం’’ అని రాష్ట్రపతి చెప్పారు. దేశ సరిహద్దుల్ని, దేశంలో శాంతిభద్రతల్ని కాపాడడంలో సైనికులు, పోలీసులు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిండేశారు!
-
ఎన్నికల వేళ ‘జగన్మాయ’!
ఎన్నికల వేళ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం దిమ్మదిరిగే షాకిచ్చింది..! బుధవారం ఉదయం నుంచే సెల్ఫోన్కి వస్తున్న మెసేజ్లు చూసి ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
జగన్ జమానాలో.. ఆశా ‘నిరాశై’..!
ప్రజారోగ్యంలో కీలకంగా వ్యవహరించే ఆశా కార్యకర్తల బతుకులతో సీఎం జగన్ ఆడుకున్నారు. పని భారాన్ని పెంచి, వారితో వెట్టిచాకిరీ చేయించారు. తాత్కాలిక పద్ధతిలో పనిచేసే వీరికి సంక్షేమ పథకాలను దూరం చేశారు. -
జగన్ పంతం.. జలయజ్ఞ విధ్వంసం!
తడిచెమ్మ తగలని కృష్ణా డెల్టా చేలు బీడుపడ్డాయి. ‘కాలువ నీరెప్పుడు వస్తుందంటే చెప్పరు.. ఈ కష్టాల సాగు మావల్ల కాదు’ అంటూ గోదావరి రైతు పంట విరామం ప్రకటించాడు. -
ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారు
వివిధ రకాల స్కీములు పెట్టి ప్రజల జేబుల్ని కొల్లగొట్టే గొలుసుకట్టు కంపెనీల కథలెన్నో విన్నాం కదా? ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు.. రాష్ట్రంలో అదే తరహాలో వ్యవహరిస్తోంది. -
సంక్షిప్త వార్తలు
స్థానిక సంస్థలకు నెల రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.998.84 కోట్లు నిధులు ఏమయ్యాయంటూ సర్పంచుల సంఘం నాయకులు ప్రశ్నించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?