TTD: తితిదే ఈవో పోస్టు... పార్ట్టైం ఉద్యోగమా?
తితిదే కేవలం శ్రీవారి ఆలయం మాత్రమే కాదు. అదో పెద్ద వ్యవస్థ. ఆదాయం, భక్తుల రాకపోకల దృష్ట్యా ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ఆలయం. రూ.3,096 కోట్ల వార్షిక బడ్జెట్. 11 వేల మందికి పైగా సిబ్బంది.. రోజూ వేల సంఖ్యలో తరలి వచ్చే భక్తులు.. శ్రీవారి దర్శనం కోసం క్యూ కట్టే ప్రముఖులు.
ఈనాడు, అమరావతి: తితిదే కేవలం శ్రీవారి ఆలయం మాత్రమే కాదు. అదో పెద్ద వ్యవస్థ. ఆదాయం, భక్తుల రాకపోకల దృష్ట్యా ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ఆలయం. రూ.3,096 కోట్ల వార్షిక బడ్జెట్. 11 వేల మందికి పైగా సిబ్బంది.. రోజూ వేల సంఖ్యలో తరలి వచ్చే భక్తులు.. శ్రీవారి దర్శనం కోసం క్యూ కట్టే ప్రముఖులు.. వీరంతా ఉంటారు. అలాంటి పెద్ద వ్యవస్థను పర్యవేక్షించేందుకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి హోదాలో ఉన్న ఐఏఎస్ అధికారిని కార్యనిర్వహణాధికారిగా ప్రభుత్వం నియమిస్తుంది. ఆ అధికారి నిత్యం తిరుపతిలోనే ఉండి, మొత్తం వ్యవస్థను పర్యవేక్షించాలి. కానీ కొన్నాళ్లుగా అలా జరగడం లేదు. వైకాపా అధికారంలోకి వచ్చాక 2020 అక్టోబరులో సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్రెడ్డిని తితిదే ఈవోగా నియమించింది. తర్వాత ఆయనను ఆ పోస్టులో కొనసాగిస్తూనే... మరిన్ని కీలక బాధ్యతలు అప్పగిస్తోంది. అవి అమరావతిలో ఉండి నిర్వహించాల్సిన బాధ్యతలు. దీంతో తితిదే ఈవోగా ఆయన పూర్తి సమయం కేటాయించలేని పరిస్థితి నెలకొంది. కొవిడ్ రెండోదశ ఉద్ధృతంగా ఉన్నప్పుడు.. 2021 ఏప్రిల్లో ఆయనను తితిదే ఈవోగా కొనసాగిస్తూనే, విజయవాడలోని రాష్ట్రస్థాయి కొవిడ్ కంట్రోల్ కేంద్రానికి ఛైర్మన్గా ప్రభుత్వం నియమించింది. ఆ సమయంలో కొద్దిరోజులు మాత్రం తితిదే ఈవో బాధ్యతల్ని అదనపు ఈఓ ధర్మారెడ్డికి అప్పగించింది. తర్వాత మళ్లీ తితిదే ఈవోగా జవహర్రెడ్డి పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తుండగా... ఆయనను జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానూ ప్రభుత్వం నియమించింది. తర్వాత ఆయనను ఈవోగా కొనసాగిస్తూనే, జలవనరులశాఖ నుంచి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోస్టు అత్యంత కీలకమైంది. రోజువారీ పాలనా వ్యవహారాల్లో మునిగి తేలాల్సి ఉంటుంది. తితిదే లాంటి పెద్ద వ్యవస్థకు ఈవోగా ఉన్న అధికారికి.. ఏకకాలంలో వేరే కీలకమైన బాధ్యతలూ అప్పగిస్తే ఎలా న్యాయం చేయగలరన్న విమర్శలు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ చదువులు మాకొద్దు ‘మామా’
జగన్ పాలనలో యువత ఉన్నత చదువులు చదివేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ చదువులు మాకొద్దంటూ పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారు. ఉన్నత విద్యలో నాణ్యత లేకపోవడం.. విద్యా సంస్థలను రాజకీయాలకు నిలయాలుగా మార్చేయడంతో యువత ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతోంది. -
సుప్రీంకూ అబద్ధాలేనా?
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనేలా ఉంది గనుల శాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి తీరు. -
పోస్టల్ బ్యాలట్ను 12 వరకు పొడిగించాలి
పోస్టల్ బ్యాలట్ ప్రక్రియను ఈనెల 12 వరకు పొడిగించాలని సీఈవోను పలువురు తెదేపా నేతలు.. ఏపీ ఐకాస అమరావతి ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు, పలిశెట్టి దామోదరరావులు.. ఐక్యవేదిక కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి బాజీ పఠాన్, షేక్ అబ్దుల్ రజాక్లు కోరారు. -
బీరాలు పలికి.. బేరానికొచ్చి!
వైకాపా విపక్షంలో ఉన్నప్పుడు ‘ప్రత్యేక హోదా’పై జగన్ చెలరేగిపోయారు. కేంద్రంపై రంకెలు వేశారు. ఉద్రేకపూరిత ప్రసంగాలతో ఊగిపోయారు. వైకాపా నాయకుల్ని, కార్యకర్తల్ని రెచ్చగొట్టి బంద్లు చేయించారు. -
ఆ దేవతే లేకపోతే..
ఈ ఐదేళ్ల పాలనలో జగన్ విధ్వంసకర నిర్ణయాలకు, అడ్డగోలు పనులకు హైకోర్టు కర్రుకాల్చి వాతపెట్టిన సందర్భాలు అనేకం. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలే చాలాసార్లు బాధితులకు రక్షణగా నిలిచాయి. -
ప్రజా రాజధాని ప్రాణం తీసిన ‘ప్రజాద్రోహి జగన్’
అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. నిర్మాణం పూర్తయ్యి ఉంటే- రాష్ట్రాభివృద్ధికి అది ఆయువుపట్టు అయ్యేది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆటపట్టుగా విరాజిల్లేది. -
ఈసీ అనుమతి లేదు
ప్రభుత్వ పథకాల నిధుల పంపిణీ విషయంలో ఈ నెల 9న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం అత్యవసరంగా విచారణ జరిపింది. -
జగన్ పన్నాగం పారలేదు
జగన్ పన్నాగం పారలేదు. ఆయన ఎత్తులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముకుతాడు వేసింది. ఓటర్లకు డబ్బులు పంచడమే కాకుండా, ప్రభుత్వ పథకాల ద్వారా పోలింగుకు ఒకటి, రెండు రోజుల ముందు రూ.14,165 కోట్లు పంచేసి ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందాలని జగన్ అండ్ కో రూపొందించిన పన్నాగం పటాపంచలైంది. -
పెద్దల మాట
-
కార్టూన్
-
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!