Suryapet: జత గిత్తలు.. రూ.కోటి!

పందెం గిత్తల అమ్మకాలు, కొనుగోళ్లలో ఇదో అరుదైన సంఘటన. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన సుంకి సురేందర్‌రెడ్డి (ఏసీపీ హైదరాబాద్‌) తాను పెంచుకున్న గిత్తల్లో ఒక జతను రూ.కోటికి అమ్మారు.

Updated : 10 Aug 2023 07:33 IST

పందెం గిత్తల అమ్మకాలు, కొనుగోళ్లలో ఇదో అరుదైన సంఘటన. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన సుంకి సురేందర్‌రెడ్డి (ఏసీపీ హైదరాబాద్‌) తాను పెంచుకున్న గిత్తల్లో ఒక జతను రూ.కోటికి అమ్మారు. ఏపీలోని బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అనంతారం గ్రామానికి చెందిన ఓ రైతు ఇటీవల రూ. కోటి చెల్లించి వీటిని సొంతం చేసుకున్నారు. భీముడు, అర్జునుడుగా పిలిచే ఈ రెండు కోడెలు.. తెలుగు రాష్ట్రాల్లో గడిచిన 9 నెలల్లో జరిగిన 40కి పైగా పోటీల్లో పాల్గొన్నాయి. వాటిలో 34 సార్లు ప్రథమ బహుమతి గెలుచుకున్నాయి. తన అనుభవం ప్రకారం.. ఇంత ధర పలికిన గిత్తల జత లేదని సురేందర్‌రెడ్డి తెలిపారు.

న్యూస్‌టుడే, హుజూర్‌నగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని