48.92 లక్షల మంది ఖాతాల్లో జమకానున్న పింఛను
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65.50 లక్షల మంది పింఛనుదారుల్లో 48.92 లక్షల మంది (74%) బ్యాంకు ఖాతాలు ఆధార్తో అనుసంధానమైనట్టు గుర్తించామని.. వీరందరికీ పింఛను మొత్తాన్ని మే 1న నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు.
మరో 16.57 లక్షల మందికి ఇళ్ల వద్దనే పంపిణీ
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడి
ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65.50 లక్షల మంది పింఛనుదారుల్లో 48.92 లక్షల మంది (74%) బ్యాంకు ఖాతాలు ఆధార్తో అనుసంధానమైనట్టు గుర్తించామని.. వీరందరికీ పింఛను మొత్తాన్ని మే 1న నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. మిగతా 16.58 లక్షల మందికి ఇంటింటికీ వెళ్లి అందిస్తామన్నారు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో మంచానపడిన వారు, వీల్ఛైర్లకు పరిమితమైనవారు, సైనిక పింఛన్లు తీసుకునే వారితోపాటు ఖాతా లేనివారికి ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేస్తామని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 1నుంచి 5వ తేదీ వరకు పింఛను పంపిణీ ఉంటుందని తెలిపారు. ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లను, బ్యాంకర్లను ఆదేశించామని వివరించారు. పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అందిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పింఛనుదారులు అసౌకర్యానికి గురికాకుండా చూడాలని ఈసీ సూచించిందని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు ఫిఫోతోనే చెల్లింపులు.. ఇప్పుడెందుకు లేవు?
రాష్ట్రంలో ప్రస్తుతం బిల్లుల చెల్లింపుపై వివాదం రేగుతోంది. పోలింగ్ ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడేలోపు వైకాపా అనుయాయులు, గుత్తేదారులు ఆర్థికశాఖ నుంచి తమ బిల్లులను సాధించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. -
ఓటర్ల కోసం దూసుకెళ్లిన రైలుబండి
ఓటర్లు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తున్న రైలు ఆలస్యంగా నడుస్తుండటంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) స్పందించి ఆ రైలుకు గ్రీన్ఛానల్ ఏర్పాటు చేయించారు. -
ఉపాధి కల్పనతోనే అసలైన వృద్ధి
మనది వేగంగా వృద్ధి చెందుతున్న అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అంటున్నాం. అభివృద్ధి రేటు 7 శాతం అంటున్నాం. వృద్ధి అంత వేగంగా ఉంటే నిరుద్యోగం ఎందుకు ఉందన్నది ఓ ప్రశ్న. దానికి చాలా కారణాలు ఉండవచ్చు. -
పథకాల నిధులు.. గుత్తేదార్లకా?
రాష్ట్రంలో పేదలకు జనవరి నెల నుంచి పెండింగ్లో ఉంచిన రూ.14,165 కోట్ల డీబీటీ నిధుల చెల్లింపులు నిలిపివేసి.. వైకాపా అనుయాయ గుత్తేదారులకు ఆ సొమ్ములు చెల్లించేసేందుకు గూడుపుఠాణి సాగుతోంది. -
44 రోజులు... రూ.17 వేల కోట్ల అప్పులు
ఆంధ్రప్రదేశ్లో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే విపరీతమైన అప్పులు పుట్టిస్తున్నారు. -
అందని ద్రాక్షలా ఈపీఎఫ్ అధిక పింఛను
ఇప్పటి వరకు కేవలం రూ.2-3 వేల పింఛనుతో నెట్టుకొస్తున్న ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల్లో కొందరు అధిక పింఛను పొందేందుకు అవకాశం కలిగినా.. ఈపీఎఫ్ అధికారులు అనేక కొర్రీలువేసి ముప్పుతిప్పలు పెడుతున్నారు. -
సొంత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు జగన్ ఎత్తుగడ
జగన్ ప్రభుత్వం చివరిలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చెల్లించేందుకు సిద్ధమైందని, దీన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు తెదేపా అధినేత చంద్రబాబు మంగళవారం లేఖ రాశారు. -
కుక్క కాట్లు పెరుగుతున్నాయ్
రాష్ట్రంలో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. పాదచారులు, వాహనచోదకులు ప్రాణాలు చేతిలో పెట్టుకుని తిరగాల్సి వస్తోంది. పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత కంగారు పడుతున్నారు. -
జెన్కో థర్మల్ కేంద్రాల్లో ఒక్క రోజుకే బొగ్గు!
రాష్ట్రంలోని జెన్కో థర్మల్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కోసం రోజుకు సగటున 78,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. విద్యుదుత్పత్తి ఆధారంగా బొగ్గు వినియోగం లెక్కలు మారతాయి. -
ఏపీ ఎస్ఈఐఏ ఛైర్మన్గా బి.శ్రీధర్
రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ మదింపు ప్రాధికార సంస్థ (స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ) ఛైర్మన్గా విజయవాడకు చెందిన బి.శ్రీధర్ను, సభ్యుడిగా నూజివీడు ఆర్జీయూకేటీ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్ను నియమిస్తూ కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. -
ఎమ్మెల్యే దాడి హేయం: నిమ్మగడ్డ రమేశ్కుమార్
ఓటు వేసేందుకు వెళ్లిన గొట్టుముక్కల సుధాకర్పై తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ దాడికి పాల్పడడం దుర్మార్గమని సీఎఫ్డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ అన్నారు. -
స్వయం ప్రతిపత్తి కళాశాలలపై ఉన్నత విద్యామండలి పెత్తనం
రాష్ట్రంలో స్వయంప్రతిపత్తి కళాశాలల్లో సిలబస్, సబ్జెక్టులపై జోక్యం చేసుకుంటూ విశ్వవిద్యాలయాల ద్వారా ఉన్నత విద్యామండలి పెత్తనం చేస్తోంది. -
జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి
కుటుంబ సభ్యులతో కలిసి యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్లకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి జగన్కు సీబీఐ ప్రధాన న్యాయస్థానం అనుమతించింది. -
ఏపీఈఏపీ సెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
ఏపీఈఏపీ సెట్-2024 నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే ఉపకులపతి జీవీఆర్ ప్రసాదరాజు తెలిపారు. కాకినాడలో యూనివర్సిటీ అధికారులు, సెట్ కన్వీనర్ కె.వెంకటరెడ్డి, కో కన్వీనర్లు, కోఆర్డినేటర్లతో పరీక్ష నిర్వహణకు సంబంధించి మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. -
గురుకుల ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల
ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షల ఫలితాలను కార్యదర్శి నరసింహారావుతో కలిసి కమిషనర్ సురేష్కుమార్ మంగళవారం విడుదల చేశారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో బీటెక్ విద్యార్థులకు ఇంటర్న్షిప్
ఉన్నత పాఠశాలల్లో ట్యాబ్లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ప్యానల్స్ వినియోగంపై ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంజినీరింగ్ నాలుగో ఏడాది చదివే విద్యార్థులను నియమిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వెల్లడించారు. -
ఏపీ పీసెట్ దరఖాస్తు గడువు పెంపు
వ్యాయామ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ పీసెట్ దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు కన్వీనర్ ఆచార్య జాన్సన్ చెప్పారు. -
సంక్షిప్త వార్తలు (5)
సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని శ్రీచైతన్య స్కూల్ డైరెక్టర్ సీమ తెలిపారు.