2030కి భారత్ నుంచి రూ.7 లక్షల కోట్ల ఎగుమతులు: అమెజాన్

దిల్లీ: అంతర్జాతీయంగా విక్రయించేందుకు 2015-2025 మధ్య తమ సంస్థ భారత్ నుంచి దాదాపు 1.76 లక్షల కోట్ల (20 బిలియన్ డాలర్ల) వస్తువులను సమీకరించినట్లు అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ఇండియా అధిపతి శ్రీనిధి కల్వపూడి తెలిపారు. 2030 నాటికి భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువుల విలువ రూ.7 లక్షల కోట్లు (80 బి.డా.) మించొచ్చని అంచనా వేశారు. భారత ఉత్పత్తులపై అమెరికా అధిక సుంకాలు విధించడం తమ నియంత్రణలో లేని అంశమని.. అయినా కూడా భారత్ నుంచి వస్తు సమీకరణ కొనసాగిస్తామని వివరించారు. గత పది సంవత్సరాల్లో ప్రపంచ వినియోగదారులకు తమ ప్లాట్ఫామ్ ద్వారా 75 కోట్లకు పైగా ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులను అందించినట్లు తెలిపారు.
ఏడాది వ్యవధిలో తమ ప్లాట్ఫామ్ ద్వారా వస్తువులను ఎగుమతి చేస్తున్న వారి సంఖ్య 33% వృద్ధి చెంది 2 లక్షలకు చేరిందని..ఇందులో ఔత్సాహికులు, చిన్న వ్యాపార సంస్థల నిర్వాహకులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. దిల్లీ, రాజస్థాన్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, హరియాణ రాష్ట్రాల నుంచి అధికంగా ఎగుమతిదార్లు ఉన్నారని తెలిపారు.
ఆరోగ్య- వ్యక్తిగత సంరక్షణ (45%), బ్యూటీ (45%), బొమ్మలు (44%), గృహ సంరక్షణ (39%), వస్త్రాలు (37%), ఫర్నిచర్ (36%) విభాగాల నుంచి ఎగుమతులు ఎక్కువ నమోదయ్యాయని విశ్లేషించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ఉద్యోగుల ప్రతిభను గుర్తించేందుకు ఎస్బీఐ-స్టార్ అవార్డులు
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ ఉద్యోగుల ప్రతిభను గుర్తించేందుకు ప్రత్యేక అవార్డులను ప్రకటించింది. - 
                                    
                                        

పెట్రోలు విక్రయాలకు పండగ జోష్
పండగ సమయంలో ప్రయాణాలు పెరగడంతో అక్టోబరులో పెట్రోల్ అమ్మకాలు 5 నెలల గరిష్ఠానికి చేరాయి. అయితే ఇందుకు భిన్నంగా డీజిల్ వినియోగంలో స్తబ్దత కొనసాగిందని ప్రభుత్వ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. - 
                                    
                                        

భారత్కు సౌదీ అరేబియా ఫ్లైయెడీల్ విమానాలు
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత విమానయాన విపణిపై ఆశతో, సౌదీ అరేబియాకు చెందిన ఫ్లైయెడీల్ 2026 తొలి త్రైమాసికం నుంచి ముంబయితో పాటు మన దేశంలోని పలు నగరాలకు విమానాలను ప్రారంభించనుంది. - 
                                    
                                        

ఓయో బోనస్ ఇష్యూ గడువు పొడిగింపు
బోనస్ ఇష్యూ కోసం దరఖాస్తుల తుది గడువును పొడిగించినట్లు ఆతిథ్య సేవల సంస్థ ఓయో వెల్లడించింది. నమోదుకాని ఈక్విటీ వాటాదార్ల కోసం గడువును నవంబరు 1 నుంచి 7వ తేదీకి పొడిగించినట్లు సంస్థ తెలిపింది. - 
                                    
                                        

సూచీలు పుంజుకోవచ్చు
భారత స్టాక్ మార్కెట్లు ఈ వారం పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. నిఫ్టీ-50 తిరిగి తన 26,000 స్థాయిని అందుకోవచ్చని అంటున్నారు. - 
                                    
                                        

పసిడి ప్రతికూలమే!
పసిడి డిసెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.1,22,890 కంటే ఎగువన చలించకుంటే ప్రతికూల ధోరణి కొనసాగుతుందని భావించవచ్చు. - 
                                    
                                        

సీఎంఎస్-03 ఉపగ్రహ ప్రయోగంలో అనంత్ టెక్నాలజీస్దీ పాత్ర
ఎల్వీఎం3-ఎం5 వాహక నౌక ద్వారా సీఎంఎస్-03 ఉప్రగహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించిందని అనంత్ టెక్నాలజీస్ ఛైర్మన్ సుబ్బారావు పావులూరి తెలిపారు. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు (5)
ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు టెక్ పరిశ్రమలో 218 కంపెనీలు లక్ష మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు లేఆఫ్.ఎఫ్వైఐ గణాంకాలు చెబుతున్నాయి. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఇద్దరు చిన్నారులను అనాథలను చేసిన రోడ్డు ప్రమాదం
 - 
                        
                            

అవమానాలు దాటి.. కూతుర్ని పంపి: నాన్న దిద్దిన ‘దీప్తి’..!
 - 
                        
                            

ఏఐకి సొంత తెలివి తెప్పించేందుకు ప్రయత్నించొద్దు.. మైక్రోసాఫ్ట్ AI చీఫ్ కీలక వ్యాఖ్యలు
 - 
                        
                            

మీకు హైకమాండ్ చెప్పిందా: సీఎం మార్పుపై సిద్ధరామయ్య
 - 
                        
                            

హీరో విడా నుంచి త్వరలో ఎలక్ట్రిక్ బైక్.. స్పోర్టీ లుక్తో టీజర్
 - 
                        
                            

భారత్ టెక్ పవర్హౌస్గా ఎదిగేందుకు ప్రైవేటు పెట్టుబడులు: ప్రధాని మోదీ
 


