భారత్‌కు భారీగా అమెరికా చమురు

Eenadu icon
By Business News Desk Published : 28 Oct 2025 03:54 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

2022 తర్వాత గరిష్ఠ స్థాయిలో దిగుమతులు

దిల్లీ: అమెరికా నుంచి మనదేశానికి ముడి చమురు దిగుమతులు పెరిగాయి. 2022 తర్వాత ఈ అక్టోబరులో గరిష్ఠ స్థాయికి చేరాయి. రష్యా చమురు కొనుగోలును తగ్గించాలని అమెరికా ఆంక్షలు విధిస్తుండటం, అమెరికాతో వాణిజ్య అంతరం తగ్గించుకోవాలన్న కేంద్రం వ్యూహం నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈనెల 27 నాటికి అమెరికా నుంచి వచ్చే చమురు దిగుమతులు రోజుకు 5.4 లక్షల బ్యారెళ్ల(బీపీడీ)కు చేరాయని కెప్లర్‌ గణాంకాలు చెబుతున్నాయి. 2022 తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి. అక్టోబరు నెల 5.75 బీపీడీతో ముగియొచ్చని, నవంబరులో 4-4.5 లక్షల బీపీడీ వరకు రావొచ్చని అంచనా. ప్రస్తుతం రష్యా నుంచే ఎక్కువగా ముడి చమురు దిగుమతి అవుతుండగా, ఇరాక్, సౌదీ అరేబియా రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. 

అమెరికాకు సహకారం ఇస్తామన్న సంకేతాలను అందించేందుకు భారత రిఫైనరీలు అమెరికా కంపెనీల నుంచి చమురు బుకింగ్‌ పెంచుకున్నట్లు వాణిజ్య, ప్రభుత్వ వర్గాల సమాచారం. రష్యా చమురు సంస్థలపై అమెరికా ఆంక్షలు ఇందుకు నేపథ్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు