ఆంధ్రప్రదేశ్లో రిఫైనరీ అభివృద్ధికి ఆయిల్ ఇండియాతో బీపీసీఎల్ ఒప్పందం
ఈనాడు వాణిజ్య విభాగం: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న రామాయపట్నం పోర్ట్ సమీపంలో కొత్త రిఫైనరీ, పెట్రోరసాయనాల కాంప్లెక్స్ అభివృద్ధి చేసేందుకు ఆయిల్ ఇండియా (ఓఐఎల్)తో నాన్ బైండింగ్ అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు బీపీసీఎల్ (భారత్ పెట్రోలియం కార్పొరేషన్) వెల్లడించింది. రూ.లక్ష కోట్ల పెట్టుబడితో తలపెట్టిన ఈ ప్రాజెక్టును 2030 ఆర్థిక సంవత్సరాని కల్లా పూర్తి చేయాలన్నది లక్ష్యం. 9-12 మిలియన్ టన్నుల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో మైనారిటీ వాటా తీసుకోవాలన్నది ఓఐఎల్ ప్రణాళిక. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం 6,000 ఎకరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించగా, ముందస్తు కార్యకలాపాలు జరుగుతున్నాయి. దేశీయంగా ఇంధన భద్రత, స్థిరత్వాన్ని సాధించేందుకు ఈ ఒప్పందం ఉపకరిస్తుందని, ఇంధనం-పెట్రో రసాయనాల్లో స్వయం సమృద్ధికి ఉపయోగ పడుతుందని బీపీసీఎల్ సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న రిఫైనరీస్ డైరెక్టర్ సంజయ్ ఖన్నా తెలిపారు. ఇంధన రంగంలో రిఫైనింగ్, నిల్వ, సరఫరా, పంపిణీ కార్యకలాపాలకు ఎంతగా కట్టుబడి ఉన్నామనేందుకు ఈ ఒప్పందం నిదర్శనమని ఓఐఎల్ సీఎండీ రంజిత్ రథ్ వివరించారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా 1.5 మిలియన్ టన్నుల ఎథిలిన్ క్రాకర్ యూనిట్ను ఇక్కడ నెలకొల్పనున్నారు. భారీఎత్తున ఉద్యోగాల కల్పనకు ఈ యూనిట్ ఉపయోగ పడనుంది.
దీనితో పాటు నుమాలీఘర్ రిఫైనరీ లిమిటెడ్ (ఎన్ఆర్ఎల్), ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ (ఫ్యాక్ట్)లతో కూడా ఇతర ప్రాజెక్టుల కోసం ఎంఓయూలు చేసుకున్నట్లు బీపీసీఎల్ తెలిపింది.
విమాన ఇంధన రవాణాకు
ఎన్ఆర్ఎల్ సామర్థ్యాలను 3 ఎంఎంటీపీఏ నుంచి 9 ఎంఎంటీపీఏకు పెంచిన తర్వాత పెట్రోలియం ఉత్పత్తుల రవాణా కోసం బీపీసీఎల్, ఆయిల్ ఇండియా, నుమాలీఘర్ రిఫైనరీ త్రైపాక్షిక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం సిలిగురి నుంచి ముజఫర్పూర్ మీదుగా మొఘల్సరాయ్ వరకు 700 కి.మీ. క్రాస్ కంట్రీ ప్రోడక్ట్ పైప్లైన్ను సంయుక్తంగా నిర్మించనున్నారు. దీని అంచనా వ్యయం రూ.3500 కోట్లు. మోటార్ స్పిరిట్, హైస్పీడ్ డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్)లను రవాణా చేయడానికి రూపొందించిన ఈ పైప్లైన్లో బీపీసీఎల్కు 50% వాటా కలిగి ఉంటుంది. మిగతా 50% వాటా ఆయిల్ ఇండియా, ఎన్ఆర్ఎల్ చేతిలో ఉంటాయి.
హరిత ఇంధనం, వ్యర్థాల నుంచి ఇంధన కార్యక్రమాలను బీపీసీఎల్ కొనసాగించనుంది. కోచి రిఫైనరీ సమీపంలోని బ్రహ్మపురం వద్ద రాబోయే బీపీసీఎల్ మున్సిపల్ ఘన వ్యర్థాల ఆధారిత కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మాన్యుర్, లిక్విడ్ ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మాన్యుర్లను రవాణా చేయడం కోసం ఫ్యాక్ట్తో బీపీసీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ఉద్యోగుల ప్రతిభను గుర్తించేందుకు ఎస్బీఐ-స్టార్ అవార్డులు
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ ఉద్యోగుల ప్రతిభను గుర్తించేందుకు ప్రత్యేక అవార్డులను ప్రకటించింది. - 
                                    
                                        

పెట్రోలు విక్రయాలకు పండగ జోష్
పండగ సమయంలో ప్రయాణాలు పెరగడంతో అక్టోబరులో పెట్రోల్ అమ్మకాలు 5 నెలల గరిష్ఠానికి చేరాయి. అయితే ఇందుకు భిన్నంగా డీజిల్ వినియోగంలో స్తబ్దత కొనసాగిందని ప్రభుత్వ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. - 
                                    
                                        

భారత్కు సౌదీ అరేబియా ఫ్లైయెడీల్ విమానాలు
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత విమానయాన విపణిపై ఆశతో, సౌదీ అరేబియాకు చెందిన ఫ్లైయెడీల్ 2026 తొలి త్రైమాసికం నుంచి ముంబయితో పాటు మన దేశంలోని పలు నగరాలకు విమానాలను ప్రారంభించనుంది. - 
                                    
                                        

ఓయో బోనస్ ఇష్యూ గడువు పొడిగింపు
బోనస్ ఇష్యూ కోసం దరఖాస్తుల తుది గడువును పొడిగించినట్లు ఆతిథ్య సేవల సంస్థ ఓయో వెల్లడించింది. నమోదుకాని ఈక్విటీ వాటాదార్ల కోసం గడువును నవంబరు 1 నుంచి 7వ తేదీకి పొడిగించినట్లు సంస్థ తెలిపింది. - 
                                    
                                        

సూచీలు పుంజుకోవచ్చు
భారత స్టాక్ మార్కెట్లు ఈ వారం పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. నిఫ్టీ-50 తిరిగి తన 26,000 స్థాయిని అందుకోవచ్చని అంటున్నారు. - 
                                    
                                        

పసిడి ప్రతికూలమే!
పసిడి డిసెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.1,22,890 కంటే ఎగువన చలించకుంటే ప్రతికూల ధోరణి కొనసాగుతుందని భావించవచ్చు. - 
                                    
                                        

సీఎంఎస్-03 ఉపగ్రహ ప్రయోగంలో అనంత్ టెక్నాలజీస్దీ పాత్ర
ఎల్వీఎం3-ఎం5 వాహక నౌక ద్వారా సీఎంఎస్-03 ఉప్రగహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించిందని అనంత్ టెక్నాలజీస్ ఛైర్మన్ సుబ్బారావు పావులూరి తెలిపారు. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు (5)
ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు టెక్ పరిశ్రమలో 218 కంపెనీలు లక్ష మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు లేఆఫ్.ఎఫ్వైఐ గణాంకాలు చెబుతున్నాయి. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఐదో అంతస్తు నుంచి పడి పదేళ్ల బాలుడి మృతి
 - 
                        
                            

పోలీసుల అదుపులో మద్యం కేసు ఏ-20 నిందితుడు
 - 
                        
                            

బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన.. ఏటా మూడు రోజులే అవకాశం
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
 - 
                        
                            

ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఒకరి మృతి.. పలువురికి గాయాలు
 


