2025-26లో చక్కెర ఎగుమతులకు అనుమతులు!

Eenadu icon
By Business News Desk Published : 30 Oct 2025 02:43 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: దేశంలో చక్కెర నిల్వలు అధికంగా ఉండడం వల్ల, 2025-26 మార్కెటింగ్‌ ఏడాదిలో ఎగుమతులకు ప్రభుత్వం అనుమతించొచ్చని కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్‌ చోప్రా తెలిపారు. 2024-25 మార్కెటింగ్‌ సంవత్సరంలో ఇథనాల్‌ తయారీకి 4.5 మిలియన్‌ టన్నుల చక్కెర వినియోగిస్తారనుకున్నా, 3.5 మిలియన్‌ టన్నులు మాత్రమే తరలించడం వల్లే నిల్వలు పోగుబడ్డాయని వివరించారు. ఏటా అక్టోబరు నుంచి మరుసటి ఏడాది సెప్టెంబరును చక్కెర మార్కెటింగ్‌ సంవత్సరంగా పరిగణిస్తారు. 

ప్రస్తుత మార్కెటింగ్‌ సంవత్సరంలో 34 మిలియన్‌ టన్నుల పంచదార ఉత్పత్తి అవుతుందని అంచనా కాగా, దేశీయ గిరాకీ 28.5 మిలియన్‌ టన్నులుగా ఉండొచ్చు. గతేడాది 10 లక్షల టన్నుల చక్కెర ఎగుమతికి అనుమతి ఇవ్వగా, 8 లక్షల టన్నులనే ఎగుమతి చేశారు. ప్రస్తుతం మిల్లుల వద్ద చక్కెర సగటు ధర క్వింటాల్‌కు రూ.3,885 కాగా, అంతర్జాతీయంగా రూ.3,829 మాత్రమే కావడం గమనార్హం.

చెప్పినదాని కంటే తక్కువగా...

471 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను మొలాసిస్‌ నుంచి ఉత్పత్తి చేస్తామని 2024-25లో చక్కెర పరిశ్రమ తెలిపింది. కాని 289 కోట్ల లీటర్లు మాత్రమే ఉత్పత్తి చేసింది. మొక్కజొన్న నుంచి 478 కోట్ల లీటర్లు (45%), బియ్యం నుంచి 235 కోట్ల లీటర్ల (22%) ఇథనాల్‌ తయారు చేయడమే ఇందుకు కారణం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు