Heritage Foods: హెరిటేజ్‌ ఫుడ్స్‌ చేతికి ‘గెట్‌-ఏ-వే’ ఐస్‌క్రీమ్‌ బ్రాండ్‌

Eenadu icon
By Business News Desk Published : 28 Oct 2025 04:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

‘గెట్‌-ఏ-వే’ ప్రతినిధులతో హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బ్రాహ్మణి నారా, ఇతర ఉన్నతాధికార్లు

ఈనాడు, హైదరాబాద్‌: ‘గెట్‌-ఏ-వే’ ఐస్‌క్రీమ్‌ బ్రాండును హెరిటేజ్‌ ఫుడ్స్‌ సొంతం చేసుకుంటోంది. ఈ బ్రాండ్‌ యజమాని ‘పీనట్‌బటర్‌ అండ్‌ జెల్లీ ప్రైవేట్‌ లిమిటెడ్‌’లో 51% వాటాను రూ.9 కోట్లకు స్కైగేట్‌ హాస్పిటాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి హెరిటేజ్‌ ఫుడ్స్‌ కొనుగోలు చేయనుంది. దీంతో ఈ సంస్థ హెరిటేజ్‌ ఫుడ్స్‌కు అనుబంధ కంపెనీగా మారనుంది. ఈ ప్రక్రియ 45 రోజుల్లో పూర్తవుతుందని హెరిటేజ్‌ ఫుడ్స్‌ వెల్లడించింది. పీనట్‌బటర్‌ అండ్‌ జెల్లీలో మిగిలిన 49% వాటా ఆ సంస్థ ప్రస్తుత ప్రమోటర్లకే ఉంటుంది. సంస్థ కార్యకలాపాలను కొంతకాలం పాటు వారే నిర్వహిస్తారు. ఈ సంస్థలో మరో 20% వాటాను వచ్చే ఏడాది మార్చిలో, అప్పటి సంస్థాగత విలువ ప్రకారం హెరిటేజ్‌ ఫుడ్స్‌ కొనుగోలు చేస్తుంది. పీనట్‌బటర్‌ అండ్‌ జెల్లీ గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా రూ.7.89 కోట్లు, రూ.14.80 కోట్లు, రూ.18.08 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. పంచదార లేని అధిక ప్రొటీన్‌ గల ఐస్‌క్రీములు, డెసర్ట్‌లు తయారు చేయడంలో ఈ సంస్థకు అనుభవం ఉంది. దీనివల్ల తమ ఉత్పత్తుల శ్రేణి విస్తరిస్తుందని హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బ్రాహ్మణి నారా తెలిపారు. హెరిటేజ్‌ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా తాము అమ్మకాలు, పంపిణీ కార్యకలాపాలు నిర్వహించగలమని  పీనట్‌బటర్‌ అండ్‌ జెల్లీ సహవ్యవస్థాపకులు జస్‌ షా వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు