Heritage Foods: హెరిటేజ్ ఫుడ్స్ చేతికి ‘గెట్-ఏ-వే’ ఐస్క్రీమ్ బ్రాండ్

‘గెట్-ఏ-వే’ ప్రతినిధులతో హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రాహ్మణి నారా, ఇతర ఉన్నతాధికార్లు
ఈనాడు, హైదరాబాద్: ‘గెట్-ఏ-వే’ ఐస్క్రీమ్ బ్రాండును హెరిటేజ్ ఫుడ్స్ సొంతం చేసుకుంటోంది. ఈ బ్రాండ్ యజమాని ‘పీనట్బటర్ అండ్ జెల్లీ ప్రైవేట్ లిమిటెడ్’లో 51% వాటాను రూ.9 కోట్లకు స్కైగేట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేయనుంది. దీంతో ఈ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్కు అనుబంధ కంపెనీగా మారనుంది. ఈ ప్రక్రియ 45 రోజుల్లో పూర్తవుతుందని హెరిటేజ్ ఫుడ్స్ వెల్లడించింది. పీనట్బటర్ అండ్ జెల్లీలో మిగిలిన 49% వాటా ఆ సంస్థ ప్రస్తుత ప్రమోటర్లకే ఉంటుంది. సంస్థ కార్యకలాపాలను కొంతకాలం పాటు వారే నిర్వహిస్తారు. ఈ సంస్థలో మరో 20% వాటాను వచ్చే ఏడాది మార్చిలో, అప్పటి సంస్థాగత విలువ ప్రకారం హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేస్తుంది. పీనట్బటర్ అండ్ జెల్లీ గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా రూ.7.89 కోట్లు, రూ.14.80 కోట్లు, రూ.18.08 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. పంచదార లేని అధిక ప్రొటీన్ గల ఐస్క్రీములు, డెసర్ట్లు తయారు చేయడంలో ఈ సంస్థకు అనుభవం ఉంది. దీనివల్ల తమ ఉత్పత్తుల శ్రేణి విస్తరిస్తుందని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రాహ్మణి నారా తెలిపారు. హెరిటేజ్ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా తాము అమ్మకాలు, పంపిణీ కార్యకలాపాలు నిర్వహించగలమని పీనట్బటర్ అండ్ జెల్లీ సహవ్యవస్థాపకులు జస్ షా వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ఉద్యోగుల ప్రతిభను గుర్తించేందుకు ఎస్బీఐ-స్టార్ అవార్డులు
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ ఉద్యోగుల ప్రతిభను గుర్తించేందుకు ప్రత్యేక అవార్డులను ప్రకటించింది. - 
                                    
                                        

పెట్రోలు విక్రయాలకు పండగ జోష్
పండగ సమయంలో ప్రయాణాలు పెరగడంతో అక్టోబరులో పెట్రోల్ అమ్మకాలు 5 నెలల గరిష్ఠానికి చేరాయి. అయితే ఇందుకు భిన్నంగా డీజిల్ వినియోగంలో స్తబ్దత కొనసాగిందని ప్రభుత్వ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. - 
                                    
                                        

భారత్కు సౌదీ అరేబియా ఫ్లైయెడీల్ విమానాలు
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత విమానయాన విపణిపై ఆశతో, సౌదీ అరేబియాకు చెందిన ఫ్లైయెడీల్ 2026 తొలి త్రైమాసికం నుంచి ముంబయితో పాటు మన దేశంలోని పలు నగరాలకు విమానాలను ప్రారంభించనుంది. - 
                                    
                                        

ఓయో బోనస్ ఇష్యూ గడువు పొడిగింపు
బోనస్ ఇష్యూ కోసం దరఖాస్తుల తుది గడువును పొడిగించినట్లు ఆతిథ్య సేవల సంస్థ ఓయో వెల్లడించింది. నమోదుకాని ఈక్విటీ వాటాదార్ల కోసం గడువును నవంబరు 1 నుంచి 7వ తేదీకి పొడిగించినట్లు సంస్థ తెలిపింది. - 
                                    
                                        

సూచీలు పుంజుకోవచ్చు
భారత స్టాక్ మార్కెట్లు ఈ వారం పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. నిఫ్టీ-50 తిరిగి తన 26,000 స్థాయిని అందుకోవచ్చని అంటున్నారు. - 
                                    
                                        

పసిడి ప్రతికూలమే!
పసిడి డిసెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.1,22,890 కంటే ఎగువన చలించకుంటే ప్రతికూల ధోరణి కొనసాగుతుందని భావించవచ్చు. - 
                                    
                                        

సీఎంఎస్-03 ఉపగ్రహ ప్రయోగంలో అనంత్ టెక్నాలజీస్దీ పాత్ర
ఎల్వీఎం3-ఎం5 వాహక నౌక ద్వారా సీఎంఎస్-03 ఉప్రగహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించిందని అనంత్ టెక్నాలజీస్ ఛైర్మన్ సుబ్బారావు పావులూరి తెలిపారు. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు (5)
ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు టెక్ పరిశ్రమలో 218 కంపెనీలు లక్ష మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు లేఆఫ్.ఎఫ్వైఐ గణాంకాలు చెబుతున్నాయి. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

దుబాయిలోని ఇండియన్ కాన్సుల్ ప్రతినిధులతో మంత్రి నారాయణ బృందం భేటీ
 - 
                        
                            

నెల్లూరు జిల్లా జైలుకు మాజీ మంత్రి జోగి రమేశ్
 - 
                        
                            

ఒడుదొడుకులు ఎదుర్కొని.. ఫ్లాట్గా ముగిసిన సూచీలు
 - 
                        
                            

‘మా కూతురు.. చెక్క బ్యాట్, వస్ర్తంతో చేసిన బంతితో అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడేది’
 - 
                        
                            

ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి తీరుతాం: సీఎం రేవంత్రెడ్డి
 - 
                        
                            

ఉద్యోగాల పేరిట రూ.5 కోట్లు వసూలు.. విడదల రజని అనుచరులపై ఫిర్యాదు
 


