Vodafone Idea: వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరట!
ఏజీఆర్ బకాయిల పునః పరిశీలనకు కేంద్రానికి సుప్రీంకోర్టు అనుమతి

దిల్లీ: వొడాఫోన్ ఐడియాకు సుప్రీం కోర్టులో భారీ ఊరట దక్కింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి పెండింగ్లో ఉన్న సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ (ఏజీఆర్) బకాయిలు రూ.5,606 కోట్ల విషయంలో పునఃపరిశీలనకు, రాజీకి కేంద్ర ప్రభుత్వానికి కోర్టు అనుమతినిచ్చింది. టెలికాం విభాగం (డాట్) తాజాగా జారీ చేసిన ఏజీఆర్ డిమాండ్లను సవాలు చేస్తూ, వొడాఫోన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, న్యాయమూర్తి జస్టిస్ కె.వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశం ప్రభుత్వ విధానాల పరిధిలోకి వస్తుందని పేర్కొంది. టెలికాం సంస్థలు కేంద్రానికి చెల్లించాల్సిన లైసెన్సు ఫీజు, స్పెక్ట్రమ్ ఛార్జీలను లెక్కవేసేందుకు పరిగణించే ఆదాయాన్నే ఏజీఆర్గా పేర్కొంటున్నారు. 2019 నాటి సుప్రీం తీర్పులోనే ఈ బకాయిలు ప్రతిబింబించినందున, అదనపు క్లెయిములు చెల్లవని వొడాఫోన్ వాదించింది. ప్రభుత్వానికి వొడాఫోన్ ఐడియాలో 49% వాటా ఉందని, 20 కోట్ల మంది చందాదార్లు ఈ కంపెనీ సేవలపై ఆధారపడి ఉన్నారని కేంద్రం తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు సమాచారమిచ్చారు. అందువల్ల కంపెనీ లేవనెత్తిన అంశాలను పరిశీలించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆ మేరకు కేంద్రానికి ధర్మాసనం అనుమతులిచ్చింది.
డాట్తో కలిసి పరిష్కరించుకుంటాం: 20 కోట్ల మంది వినియోగదార్ల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని డాట్తో కలిసి పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కోర్టు తీర్పు అనంతరం వొడాఫోన్ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ఉద్యోగుల ప్రతిభను గుర్తించేందుకు ఎస్బీఐ-స్టార్ అవార్డులు
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ ఉద్యోగుల ప్రతిభను గుర్తించేందుకు ప్రత్యేక అవార్డులను ప్రకటించింది. - 
                                    
                                        

పెట్రోలు విక్రయాలకు పండగ జోష్
పండగ సమయంలో ప్రయాణాలు పెరగడంతో అక్టోబరులో పెట్రోల్ అమ్మకాలు 5 నెలల గరిష్ఠానికి చేరాయి. అయితే ఇందుకు భిన్నంగా డీజిల్ వినియోగంలో స్తబ్దత కొనసాగిందని ప్రభుత్వ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. - 
                                    
                                        

భారత్కు సౌదీ అరేబియా ఫ్లైయెడీల్ విమానాలు
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత విమానయాన విపణిపై ఆశతో, సౌదీ అరేబియాకు చెందిన ఫ్లైయెడీల్ 2026 తొలి త్రైమాసికం నుంచి ముంబయితో పాటు మన దేశంలోని పలు నగరాలకు విమానాలను ప్రారంభించనుంది. - 
                                    
                                        

ఓయో బోనస్ ఇష్యూ గడువు పొడిగింపు
బోనస్ ఇష్యూ కోసం దరఖాస్తుల తుది గడువును పొడిగించినట్లు ఆతిథ్య సేవల సంస్థ ఓయో వెల్లడించింది. నమోదుకాని ఈక్విటీ వాటాదార్ల కోసం గడువును నవంబరు 1 నుంచి 7వ తేదీకి పొడిగించినట్లు సంస్థ తెలిపింది. - 
                                    
                                        

సూచీలు పుంజుకోవచ్చు
భారత స్టాక్ మార్కెట్లు ఈ వారం పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. నిఫ్టీ-50 తిరిగి తన 26,000 స్థాయిని అందుకోవచ్చని అంటున్నారు. - 
                                    
                                        

పసిడి ప్రతికూలమే!
పసిడి డిసెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.1,22,890 కంటే ఎగువన చలించకుంటే ప్రతికూల ధోరణి కొనసాగుతుందని భావించవచ్చు. - 
                                    
                                        

సీఎంఎస్-03 ఉపగ్రహ ప్రయోగంలో అనంత్ టెక్నాలజీస్దీ పాత్ర
ఎల్వీఎం3-ఎం5 వాహక నౌక ద్వారా సీఎంఎస్-03 ఉప్రగహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించిందని అనంత్ టెక్నాలజీస్ ఛైర్మన్ సుబ్బారావు పావులూరి తెలిపారు. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు (5)
ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు టెక్ పరిశ్రమలో 218 కంపెనీలు లక్ష మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు లేఆఫ్.ఎఫ్వైఐ గణాంకాలు చెబుతున్నాయి. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

అప్పట్లో.. నేల మీదే నిద్ర.. పప్పన్నమే పరమాన్నం!
 - 
                        
                            

‘ఎస్ఐఆర్’కు ఈసీ రెడీ.. 12 రాష్ట్రాలు/యూటీల్లో అమలు
 - 
                        
                            

ఐదో అంతస్తు నుంచి పడి పదేళ్ల బాలుడి మృతి
 - 
                        
                            

పోలీసుల అదుపులో మద్యం కేసు ఏ-20 నిందితుడు
 - 
                        
                            

బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన.. ఏటా మూడు రోజులే అవకాశం
 


