Samsung Galaxy S25 FE: 7 ఏళ్లపాటు OS + సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో శాంసంగ్‌ గెలాక్సీ S25 FE

Eenadu icon
By Business News Team Published : 16 Sep 2025 00:13 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Samsung Galaxy S25 FE | ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ దేశీయ మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌ను విడుదల చేసింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌25 ఎఫ్‌ఈ పేరిట దీన్ని లాంచ్‌ చేసింది. ముఖ్యంగా ఏడేళ్లపాటు ఓస్‌, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ అందిస్తోంది. గెలాక్సీ ఎస్‌24 ఎఫ్‌ఈతో పోలిస్తే దీంట్లో 13 శాతం పెద్ద వీసీ కూలింగ్‌ సిస్టమ్‌ ఇచ్చారు.

గెలాక్సీ ఎస్‌25 ఎఫ్‌ఈలో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్‌ డైనమిక్‌ అమోలెడ్‌ 2X డిస్‌ప్లే ఇచ్చారు. 120Hz రిఫ్రెష్‌రేటు, 1,900 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ప్లస్‌ ప్రొటెక్షన్‌తో వస్తోంది. దీంట్లో Exynos 2400 ప్రాసెసర్‌ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత వన్‌ యూఐ 8తో పనిచేస్తుంది. వెనకభాగంలో 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్‌, 8 ఎంపీ టెలిఫొటో సెన్సార్‌, 12 ఎంపీ అల్ట్రావైడ్‌ షూటర్‌ ఇచ్చారు. అలాగే 12 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇది 4,900 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 45W వైర్‌డ్‌, 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఐసీ బ్లూ, జెట్‌ బ్లాక్‌, నేవీ, వైట్ కలర్స్‌లో లభిస్తోంది.

ఇక ధర విషయానికొస్తే.. ఈ ఫోన్‌ 3 వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.59,999గా కంపెనీ నిర్ణయించింది. ఇక 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ,65,999 కాగా.. 8జీబీ+512 వేరియంట్‌ ధర రూ.77,999గా పేర్కొంది. 256జీబీ వేరియంట్‌ కొనుగోలు చేసే వినియోగదారులు ఉచితంగా 512జీబీ వేరియంట్‌కు అప్‌గ్రేడ్‌ పొందొచ్చని శాంసంగ్‌ తెలిపింది. దీంతోపాటు రూ.5,000 బ్యాంక్‌ క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చని పేర్కొంది. సెప్టెంబర్‌ 29 నుంచి ఈ ఫోన్‌ విక్రయాలు ప్రారంభమవుతాయి. శాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్లు, కొన్ని ఎంపిక చేసిన ఆన్‌లైన్‌ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు