Road Accident: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఎస్కార్ట్‌ వాహనం ఢీకొని ఒకరు మృతి

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఎస్కార్ట్‌ వాహనం ఆటోను ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. 

Updated : 06 Mar 2024 06:04 IST

త్రిపురాంతకం: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఎస్కార్ట్‌ వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగింది. సీఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో మంత్రి విజయవాడ నుంచి మార్కాపురం వెళ్తుండగా ఎస్కార్ట్‌ వాహనం ఆటోను ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడిని త్రిపురాంతకం మనరాజుపాలెంకు చెందిన ఇజ్రాయిల్‌గా గుర్తించారు. ప్రమాదం సమయంలో మంత్రి సురేష్‌ ముందు వాహనంలో ఉన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని