ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఒకే కుటుంబంలో ముగ్గురి దుర్మరణం
వర్ధన్నపేట మండలం డీసీ తండా వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు.
వర్ధన్నపేట : వర్ధన్నపేట మండలం డీసీ తండా వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రకాశం జిల్లా శంకరాపురానికి చెందిన ఇల్లూరి కృష్ణారెడ్డి(40) వరంగల్లోని పెరుకవాడలో స్థిరపడ్డారు. ఇటీవల తమ స్వగ్రామంలో అయ్యప్పస్వాములకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి వరంగల్కు కారులో బయలుదేరారు. డీసీ తండా వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు.. రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కృష్ణారెడ్డి, వరలక్ష్మి(35), వెంకటసాయిరెడ్డి(14) అక్కడికక్కడే మృతిచెందారు. రవీందర్ రెడ్డి, లక్ష్మీదేవి, విజ్ఞాన్, హేమలత రెడ్డి, శ్రీధర్ తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
గుంటూరు జిల్లా తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం రేగింది. కళాశాల విద్యార్థుల నుంచి రూ.5లక్షల విలువైన 80 గ్రాముల మాదక ద్రవ్యాలను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
పెళ్లయిన నెలకే బావను కడతేర్చారు.. చెల్లి ప్రేమ వివాహం ఇష్టం లేని బావమరుదుల ఘాతుకం
తమ చెల్లెలు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని సోదరులు (పెదనాన్న కుమారులు) పగతో రగిలిపోయారు. పెద్ద మనుషులు విధించిన జరిమానా చెల్లించలేదన్న సాకుతో బావను కర్కశంగా కడతేర్చారు. -
మంటల్లో చిక్కుకుని రైతు మృతి
పొలంలోని వరి కొయ్యలు కాల్చేందుకు నిప్పుపెట్టిన రైతు ప్రమాదవశాత్తు ఆ మంటల్లోనే చిక్కుకుని మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పోత్నూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. -
వాణిజ్య పన్నులశాఖలో ఐదుగురు అధికారుల అరెస్టు
జీఎస్టీ ఎగవేతలకు సహకరిస్తూ అవినీతికి పాల్పడిన ఐదుగురు అధికారులను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేయడం వాణిజ్య పన్నులశాఖలో సంచలనం సృష్టించింది. -
43,200 సీసాల గోవా మద్యం పట్టివేత
గోవా నుంచి రాష్ట్రానికి భారీగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
శంషాబాద్లో రూ.25 కోట్ల ఆభరణాల స్వాధీనం
ముంబయి నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 34.78 కిలోల బంగారు, 43.60 కిలోల వెండి ఆభరణాలను శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది. -
మార్ఫింగ్ కేసులో ఐదుగురికి బెయిల్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల మార్ఫింగ్ వీడియో కేసులో కాంగ్రెస్ సామాజిక మాధ్యమ విభాగానికి చెందిన సభ్యులు ఐదుగురిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు ప్రకటించారు. -
ప్రియురాలి ఇంటికి పార్సిల్బాంబు.. ఆమె భర్త, కుమార్తె మృతి
గుజరాత్లోని వడాలిలో ఓ వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు పార్సిల్ బాంబు పంపాడు. అది పేలడంతో ఆమె భర్త, కుమార్తె మరణించారు. జీతూభాయ్ హీరాభాయ్ వంజారా(32) అనే వ్యక్తి కుటుంబం వడాలిలో ఉంటోంది.