విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టి డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా.. భారీగా చెలరేగిన మంటలు

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెంకటరావుపేట వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టి డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది.

Updated : 09 Jan 2024 09:35 IST

మెట్‌పల్లి: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెంకటరావుపేట వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టి డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంతో హైవేపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఘట్‌కేసర్‌ నుంచి జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం రాఘవపేటలోని ఓ బంకుకు డీజిల్‌ తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని