Crime: థ్రిల్ కోసం డ్రగ్స్ వినియోగం.. ఓవర్ డోస్ కావడంతో యువతి మృతి
డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా ఓ 18 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన లఖ్నవూలోని తివారీగంజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
లఖ్నవూ: డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా 18 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన లఖ్నవూలోని తివారీగంజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసే ఓ యువతి(18) ఏప్రిల్ 3న లఖ్నవూలోని తన ఇంటికి వెళ్లింది. అనంతరం ఏప్రిల్ 7న ఆమె బెంగళూరుకు తిరుగు ప్రయాణమైన సమయంలో తన స్నేహితుడు వివేక్ మౌర్యను కలిసింది. వారు ఓ ఖాళీ ప్లాట్కు వెళ్లారు. డ్రగ్స్ తీసుకుంటే థ్రిల్ వస్తుందని వివేక్ ఆ యువతికి ఓ సిరంజిని ఇంజెక్ట్ చేశాడు. డ్రగ్స్ మోతాదు ఎక్కువ కావడంతో కొంతసేపటికి ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకుంది. దీంతో భయపడిన యువకుడు తానూ మత్తులో ఉండడంతో పోలీసులకు ఫోన్ చేసి సహాయం కోరాడు. వారు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ యువతి మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించారు.
ఈ విషయం తెలియగానే యువకుడు భయాందోళనకు గురై ఆసుపత్రి నుంచి పారిపోగా పోలీసులు అతడిని ఇందిరా కెనాల్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టానికి తరలించారు. విచారణలో గతంలో లఖ్నవూలోని న్యూ హైదరాబాద్ ప్రాంతంలోని వివేక్ ఇంట్లో ఆ యువతి కుటుంబం అద్దెకు ఉండేదని పోలీసులు గుర్తించారు. వివేక్ డ్రగ్స్కు అలవాటుపడ్డాడని, ఆమెను కూడా మాదకద్రవ్యాలు తీసుకునేలా ప్రోత్సహించేవాడన్నారు.
యువకుడు ఉద్దేశపూర్వకంగా తమ కుమార్తెను హత్య చేసి ఉండవచ్చని యువతి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేశారు. కాగా నిందితుడు తన స్నేహితురాలే తనకు ఫోన్ చేసి డ్రగ్స్ తీసుకుందామని అడిగిందని తెలిపాడు. దాంతో తాను ఆమెను తివారీగంజ్లోని మరో స్నేహితుడి ఖాళీ ప్లాట్కి తీసుకెళ్లానన్నాడు. థ్రిల్ కోసం ఎక్కువ మోతాదు ఉన్న డ్రగ్ను మొదట తాను వేసుకుని, ఆ తర్వాత ఆ యువతికి ఇంజెక్ట్ చేశానన్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తుపాకీతో కాల్చుకొని.. సచిన్ సెక్యూరిటీగార్డు ఆత్మహత్య..!
స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కు చెందిన సిబ్బంది ఒకరు ప్రాణాలు తీసుకున్నారు. అతడు సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) రక్షణ వలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. -
చెట్టును ఢీకొన్న కారు.. మంటలు చెలరేగి వృద్ధ దంపతులు మృతి
ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతి చెందారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం.. పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు
చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
మెడకు స్కార్ఫ్ చుట్టి.. అంగన్వాడీ టీచర్ హత్య
అంగన్వాడీ ఉపాధ్యాయిని హత్యకు గురైన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. -
మాజీ మంత్రి అఖిలప్రియ బాడీగార్డ్పై హత్యాయత్నం.. సీసీ కెమెరాలో రికార్డు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్పై హత్యాయత్నం జరిగింది. -
తెదేపా కార్యకర్తపై క్రికెట్ స్టంప్తో దాడి
శ్రీకాకుళం జిల్లా పలాసలో వైకాపా అల్లరిమూకలు రెచ్చిపోయాయి. రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు ప్రోద్బలంతో నియోజకవర్గంలో ఎక్కడికక్కడ తెదేపా కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. -
ఒక దొంగ.. 110 రోజులు.. 200 విమానాల్లో ప్రయాణం
ఒకే ఒక్కడు... ఒకే ఏడాది 110 రోజులు.. 200 విమానాల్లో ప్రయాణం. నిరుడు దేశంలోని వివిధ నగరాలను విమానాల్లో చుట్టేసిన అతను ఒక దొంగ అంటే నమ్ముతారా? కేవలం విమాన ప్రయాణికులే లక్ష్యంగా చోరీలు చేస్తున్న ఘరానా దొంగ దిల్లీ పోలీసులకు చిక్కాడు. -
30 మంది మావోయిస్టుల అరెస్టు
ఛత్తీస్గఢ్ బీజాపుర్ జిల్లాలో 9 మంది కీలక మావోయిస్టు నేతలు సహా 30 మంది దళ సభ్యులు మంగళవారం పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు. -
మిధాని అదనపు జనరల్ మేనేజర్పై సీబీఐ కేసు
కాంట్రాక్టరుకు బిల్లులు చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన కంచన్భాగ్ మిధాని (మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్) అదనపు జనరల్ మేనేజర్ టి.జానకిరాంపై సీబీఐ మంగళవారం కేసు నమోదు చేసింది. -
నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. -
పెంపుడు కుక్క దాడిలో పసికందు మృతి
అప్పటి వరకు తల్లి ఒడిలో ఆడుకున్న చిన్నారిపైకి ఓ శునకం మృత్యువై వచ్చింది. తీవ్రంగా దాడి చేయడంతో ఆ ఐదు నెలల పసిప్రాణం విలవిల్లాడింది. రక్తపు మడుగులో ఉన్న బాలుడిని తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినా.. అప్పటికే మృతిచెందాడు.
తాజా వార్తలు (Latest News)
-
మూడు రోజుల వరుస లాభాలకు విరామం.. నష్టాల్లో సూచీలు
-
14 నెలల క్రితమే గుర్తించినా.. 14 మంది ప్రాణాలు పోయే వరకు..
-
జేసీ ప్రభాకర్రెడ్డికి అస్వస్థత.. సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స
-
రఫాలో మాజీ సైన్యాధికారి మృతి.. భారత్కు ఐరాస క్షమాపణలు
-
400 సీట్లు గెలిస్తే.. భారత్లో పీవోకే విలీనం ఖాయం: హిమంత బిశ్వశర్మ
-
తుపాకీతో కాల్చుకొని.. సచిన్ సెక్యూరిటీగార్డు ఆత్మహత్య..!