Karnataka: మాట వినలేదని మద్యం దుకాణంపై మహిళల కన్నెర్ర..!
వద్దని వ్యతిరేకించినా మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై కర్ణాటకలోని ముస్లాపూర్లో స్ధానిక మహిళలు కన్నెర్ర చేశారు. రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని...
బెంగళూరు: వద్దని వ్యతిరేకించినా మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై కర్ణాటకలోని ముస్లాపూర్లో స్ధానిక మహిళలు కన్నెర్ర చేశారు. రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని ధ్వంసం చేశారు. ముస్లాపూర్ గ్రామంలో మద్యం దుకాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించగా.. మహిళలు వ్యతిరేకిస్తూ ఇటీవల నిరసన తెలిపారు. అయినా రెండు రోజుల క్రితం దుకాణాన్ని ప్రారంభించారు. మద్యం దుకాణాన్ని మూసివేయాల్సిందిగా 50 మంది మహిళలు యజమానికి మొదట విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన అంగీకరించకపోవడంతో ఆగ్రహించిన మహిళలు మద్యం దుకాణంలోకి ప్రవేశించి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
43,200 సీసాల గోవా మద్యం పట్టివేత
గోవా నుంచి రాష్ట్రానికి భారీగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
శంషాబాద్లో రూ.25 కోట్ల ఆభరణాల స్వాధీనం
ముంబయి నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 34.78 కిలోల బంగారు, 43.60 కిలోల వెండి ఆభరణాలను శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది. -
మార్ఫింగ్ కేసులో ఐదుగురికి బెయిల్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల మార్ఫింగ్ వీడియో కేసులో కాంగ్రెస్ సామాజిక మాధ్యమ విభాగానికి చెందిన సభ్యులు ఐదుగురిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు ప్రకటించారు. -
ప్రియురాలి ఇంటికి పార్సిల్బాంబు
గుజరాత్లోని వడాలిలో ఓ వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు పార్సిల్ బాంబు పంపాడు. అది పేలడంతో ఆమె భర్త, కుమార్తె మరణించారు. జీతూభాయ్ హీరాభాయ్ వంజారా(32) అనే వ్యక్తి కుటుంబం వడాలిలో ఉంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)