అజీర్తి సమస్యకు మామిడి పండే ఔషధం!
పోషకాలకు, రుచికి పెట్టింది పేరైన మామిడి పండు.. అజీర్తి నివారణకు సహజ ఔషధంగా పనిచేస్తుందని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) ఆచార్యులు తమ పరిశోధనలో గుర్తించారు.
ఎలుకలపై హెచ్సీయూ ఆచార్యుల పరిశోధనలో గుర్తింపు
అమెరికన్ కెమికల్ సొసైటీ జర్నల్లో ప్రచురణ
వైద్యపరంగా ‘మాంగిఫెరిన్’ అభివృద్ధిపై దృష్టి
ఈనాడు, హైదరాబాద్: పోషకాలకు, రుచికి పెట్టింది పేరైన మామిడి పండు.. అజీర్తి నివారణకు సహజ ఔషధంగా పనిచేస్తుందని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) ఆచార్యులు తమ పరిశోధనలో గుర్తించారు. మామిడిలో ఉండే మాంగిఫెరిన్ రసాయనం (బయోయాక్టివ్ కాంపొనెంట్) అజీర్తిని నివారిస్తుందని ఎలుకలపై చేసిన పరిశోధన ద్వారా శాస్త్రీయంగా నిర్ధారించారు. ఈ అధ్యయనం వివరాలు ‘అమెరికన్ కెమికల్ సొసైటీ ఫార్మాకాలజీ, ట్రాన్స్లేషన్’ జర్నల్లో తాజాగా ప్రచురితమయ్యాయి.
మామిడిపండ్లలో లభించే మాంగిఫెరిన్ రసాయం.. అజీర్తిని తగ్గిస్తుందా? పెద్దపేగు, చిన్నపేగులో జీర్ణ వ్యవస్థను చురుకుగా పనిచేయిస్తుందా? పేగు కాన్సర్ కారక కణాలను నిర్వీర్యం చేస్తుందా? అన్న అంశాలను తెలుసుకునేందుకు హెచ్సీయూ ఆచార్యులు రెడ్డన్న, పరిశోధకులు డాక్టర్ గంగాధర్, కె.సురేష్, కె.అనిల్ మూడేళ్ల క్రితం నడుంకట్టారు. ఇందుకోసం ఎలుకలపై ప్రయోగాలు చేశారు. ఎలుకలకు కృత్రిమ అజీర్తిని కల్పించి, ఔషధంగా మాంగిఫెరిన్ ఇవ్వడం ప్రారంభించారు. ఈ క్రమంలో వాటిలో అజీర్తి తగ్గడంతో పాటు, జీర్ణ వ్యవస్థ చురుకుగా పనిచేయడం, కోలన్ క్యాన్సర్ సెల్ లైన్ దాదాపుగా నిర్వీర్యం కావడాన్ని గుర్తించారు. దీంతో మాంగిఫెరిన్ను వైద్యపరంగా అభివృద్ధి చేసేందుకు ముందస్తు క్లినికల్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.
పెరుగుతున్న జీర్ణకోశ సమస్యలు
‘‘మన దేశంలో చాలామంది మసాలాలతో కూడిన ఆహారం తీసుకోవడంతో జీర్ణాశయాంతర పేగు పనితీరు క్రమంగా తగ్గుతోంది. దీంతో పేగువాపు వ్యాధి (ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్)తో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. 1990 నుంచి 2019 మధ్య ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య రెట్టింపైంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పుల ఫలితంగా అజీర్తి సమస్య దీర్ఘకాలిక వ్యాధిగా మారుతుంది. ఈ సమస్యకు వేసవిలో లభించే మామిడి పండ్లతో ప్రయోజనం చేకూరుతుందని మా పరిశోధనలో గుర్తించాం.
వైద్యుల సలహాతో.. మధుమేహులూ తినొచ్చు
మామిడి పండ్లు తింటే రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరుగుతుంది. అయితే ఈ పండ్లలో గ్లైసీమిక్ ఇండెక్స్ లెవెల్ (జీఐ) 51 వరకు మాత్రమే ఉంటున్నందున మధుమేహులు ఈ పండ్లను తిన్నా ఇబ్బందులు లేవని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో వైద్యుల సలహాతో మధుమేహ బాధితులూ వీటిని తినొచ్చు’’ అని రెడ్డన్న తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-విజయవాడ రహదారి దిద్దుబాటు పనులు చేపట్టండి
‘హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి దిద్దుబాటు పనులను వెంటనే చేపట్టాలి. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా నిర్ధారిత సమయంలో పూర్తి చేయాలి’ అని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు. -
అన్ని జిల్లాల్లో ఆహారశుద్ధి యూనిట్లు
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆహారశుద్ధి యూనిట్లు నెలకొల్పేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
ఆనంద్ సినీ సర్వీసెస్కు భూకేటాయింపు సబబే
రాజధాని హైదరాబాద్లోని షేక్పేట సర్వే నం.403లో 5 ఎకరాలను ఆనంద్ సినీ సర్వీసెస్కు కేటాయించడాన్ని హైకోర్టు సమర్థించింది. -
ఆస్తుల పంపిణీలో అంతులేని జాప్యం!
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా ఆస్తుల విభజనకు సంబంధించిన అనేక అంశాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. -
12లోగా అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పూర్తి చేయండి: సీఎస్
అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం కింద చేపట్టిన పనులన్నీ జూన్ 12లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. -
ఇకపై తప్పనిసరిగా ‘టీజీ’ అనే రాయాలి
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలు, స్వతంత్ర సంస్థలు తెలంగాణ సంక్షిప్త పదాన్ని తప్పనిసరిగా ‘టీఎస్’ బదులుగా ‘టీజీ’ అని రాయాలని ఆదేశిస్తూ సీఎస్ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పీజీఈసెట్ తేదీల్లో మార్పు
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న పీజీ ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(పీజీఈసెట్) నిర్వహణ తేదీలు మారాయి. -
ధ్రువపత్రాల అటెస్టేషన్లో గుర్తింపు లేని ఏజెన్సీల మోసాలు
విదేశాలకు వెళ్లే వారి ధ్రువపత్రాల అటెస్టేషన్ లేదా అపొస్టిల్ చేయించడానికి కొన్ని గుర్తింపులేని ఏజెన్సీలు ఇష్టానుసారం డబ్బులు దండుకుంటున్నాయి. -
అలసట తీర్చుతూ.. సమయానికి నిద్ర లేపుతూ..
ఉద్యోగులు కాసేపు నిద్రపోతే విధులు మరింత సమర్థంగా నిర్వహిస్తారనే ఆలోచనతో కొన్నేళ్ల క్రితమే పలు అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాల్లో నిద్రపోవడానికి ఏర్పాట్లు చేశాయి. -
వెబ్సైట్లో ఇంటర్ సప్లిమెంటరీ హాల్టికెట్లు
ఈ నెల 24 నుంచి మొదలయ్యే ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
-
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు