మినీ భారతం.. పారిశ్రామిక ప్రాంతం
ఒక వైపు ప్రాణహిత.. మరో వైపు పెద్దవాగు జీవనదుల పరవళ్లు.. సిర్పూరు కాగితం మిల్లు(ఎస్పీఎం), సర్సిల్క్ మిల్లులతో పారిశ్రామిక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది సిర్పూరు- కాగజ్నగర్ నియోజకవర్గం.
న్యూస్టుడే, కాగజ్నగర్
ఎస్పీఎం
ఒక వైపు ప్రాణహిత.. మరో వైపు పెద్దవాగు జీవనదుల పరవళ్లు.. సిర్పూరు కాగితం మిల్లు(ఎస్పీఎం), సర్సిల్క్ మిల్లులతో పారిశ్రామిక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది సిర్పూరు- కాగజ్నగర్ నియోజకవర్గం. ఉపాధి, వ్యాపారాల నిమిత్తం వివిధ రాష్ట్రాలకు చెందినవారు కాగజ్నగర్లో స్థిరపడ్డారు. భిన్న మతాల వారు ఉన్నప్పటికీ పండగలు, సాంస్కృతిక కార్యక్రమాలు కలిసిమెలసి జరుపుకొంటారు. భిన్న సంస్కృతి.. సంప్రదాయాలకు నిలయమైన కాగజ్నగర్ను మినీ భారత్గా పిలుస్తుంటారు. నియోజకవర్గం కేంద్రం సిర్పూర్(టి) అయినప్పటికీ అక్కడ కేవలం అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే స్వీకరిస్తారు. మిగతా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని పనులు కాగజ్నగర్లోనే కొనసాగుతున్నాయి.
1952లో నియోజకవర్గం ఆవిర్భవించింది. రాజకీయాలకు అతీతంగా ఏ ప్రాంతానికి చెందిన నేతలైనా ఆదరిస్తుంటారు ఇక్కడి ప్రజలు. పార్టీల కంటే వ్యక్తిత్వానికి ప్రాధాన్యమిస్తారు. శాసనసభ పునర్విభజన అనంతరం సిర్పూర్కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. గతంలో 242 క్రమసంఖ్య ఉన్న నియోజకవర్గం నెంబర్ వన్ సిర్పూర్-001గా మారింది.
స్థానికేతరులకే మొగ్గు..
1952 నుంచి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. తొలిసారి సోషలిస్టు పార్టీ నుంచి బుచ్చయ్య విజయం సాధించారు. ఆ తర్వాత ఆరు సార్లు కాంగ్రెస్, మూడుసార్లు తెదేపా, మూడుసార్లు భారాస, రెండు పర్యాయాలు స్వతంత్ర, ఒకసారి బీఎస్పీ పార్టీల అభ్యర్థులు గెలిచారు. 1957లో సిర్పూర్, చెన్నూరు ఉమ్మడిగా ఉండగా, జి.వెంకటస్వామి(ఎస్సీ) కాంగ్రెస్, రాజమల్లు(జనరల్) కాంగ్రెస్ నుంచి ఇద్దరు అభ్యర్థులు గెలిచారు. 1962, 1967లో రెండు పర్యాయాలు జి.సంజీవరెడ్డి(హైదరాబాద్ నివాసి) విజయం సాధించారు. 1967లో కార్మికశాఖ మంత్రి అయ్యారు. 1972, 1978లో రెండుసార్లు కేవీ.కేశవులు(మంథని) విజయం సాధించగా, 1972లో చేనేత జౌళిశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1983, 1985లో రెండుసార్లు కేవీ నారాయణరావు(విజయవాడ) గెలుపొందారు. 1985లో ప్రభుత్వ చీఫ్ విప్గా అప్పటి సీఎం ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితుడుగా పేరుండేది. 1989, 1994 రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా పాల్వాయి పురుషోత్తంరావు(బెజ్జూరు) గెలుపొంది, ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. ఆ తర్వాత 1999లో తెదేపా అభ్యర్థిగా పాల్వాయి పురుషోత్తంరావు పోటీ చేయగా.. ఎన్నికలకు రెండురోజుల ముందు మావోయిస్టులు కాల్చి చంపారు. అనంతరం ఆయన సతీమణి పాల్వాయి రాజ్యలక్ష్మి(తెదేపా) నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2009, 2010 రెండు సార్లు తెరాస(భారాస) కావేటి సమ్మయ్య విజయం సాధించారు. 2009 మే 16న జరిగిన ఎన్నికల్లో కావేటి సమ్మయ్య గెలుపొందగా, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2010 ఫిబ్రవరి 14న రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. ఆ సమయంలో 273 రోజుల పాటు ఎమ్మెల్యేగా కొనసాగారు. 2004, 2014, 2018లో కోనేరు కోనప్ప విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్, 2014లో బీఎస్పీ, 2018లో భారాస నుంచి పోటీ చేసి గెలుపొందారు.
నిజాం కాలంలో 1932లో కాగజ్నగర్లో రెండు భారీ పరిశ్రమలు సర్సిల్క్, ఎస్పీఎంలను స్థాపించారు. నూలు వస్త్ర పరిశ్రమ(సర్సిల్క్) కొన్నేళ్లపాటు వస్త్రాల ఉత్పత్తిలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద పరిశ్రమగా పేరుండేది. 1982లో విద్యుత్తు, సాంకేతిక సమస్య కారణంగా మిల్లు మూతపడింది. రాష్ట్రంలోనే ఏకైక కాగితం పరిశ్రమ(ఎస్పీఎం). ఎన్నికల్లో ఎస్పీఎం కార్మికుల ఓట్లు కీలకం. మిల్లులో దాదాపు ఏడువేల మంది కార్మికులుండగా, వారి కుటుంబ సభ్యులతో కలిపి దాదాపు 20 వేల మందిపైనే ఉన్నారు.
17 గ్రామాలు.. 20 వేల ఓటర్లు
1965లో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కాందిశీకులు నియోజకవర్గంలోని పలు మండలాల్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. 17 గ్రామాల్లో దాదాపు 20వేల ఓటర్లున్నారు. ఉపాధి నిమిత్తం ప్రభుత్వం అయిదెకరాల వ్యవసాయభూమి. ఎనిమిది గుంటల నివాస స్థలం కేటాయించింది. నియోజకవర్గంలో రాజకీయ ఫలితాలపై ప్రభావం చూపగలిగే బెంగాలీ ఓటర్లు కీలకం.
నియోజకవర్గ పరిధి: కాగజ్నగర్ పురపాలిక, కాగజ్నగర్, సిర్పూర్(టి), కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూరు, పెంచికల్పేట, దహెగాం మండలాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రేణులకు నిర్దేశం.. జనజాతరకు సిద్ధం
[ 02-05-2024]
ఆదిలాబాద్లో ఏప్రిల్ 22న ఇప్పటికే జనజాతర సభ పేరిట ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం రేవంత్రెడ్డి గురువారం ఆసిఫాబాద్లో జన జాతర సభ నిర్వహిస్తున్నారు. -
రైస్ మిల్లులకు తాళాలు..
[ 02-05-2024]
జిల్లాలో రైస్ మిల్లుల బాగోతాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. పోలీసుల కేసు నమోదుతో రైస్ మిల్లులకు తాళాలు వేసి వ్యాపారులు పత్తా లేకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. -
ఒక్క అవకాశం కోసం అడుగుతున్నాం : మంత్రి సీతక్క
[ 02-05-2024]
‘ఆదిలాబాద్ నుంచి తొలిసారిగా ఆదివాసీ ఆడబిడ్డ, సామాన్య మహిళను పార్లమెంటుకు పంపిద్దాం.. ఒక్క అవకాశం ఇవ్వండి.. అన్ని జిల్లాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.. అందుకే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వస్తున్నారని..’ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. -
ఓపీ చీటీ తీసుకోవటం మరింత సులువు
[ 02-05-2024]
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఓపీ(అవుట్ పేషెంట్) చీటీ తీసుకోవటానికి రోగులు, వారి సహాయకులు ఇక నుంచి గంటల తరబడి వరుసలో నిల్చోవాల్సిన అవసరం లేదు. -
బరిలో 42 మంది.. బ్యాలెట్ యూనిట్లు
[ 02-05-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి 12 మంది బరిలో ఉన్నారు. పెద్దపల్లి ఎస్సీ రిజర్వుస్థానానికి 42 మంది పోటీలో ఉన్నారు. దీంతో ఇక్కడ ఒక్కో పోలింగ్ కేంద్రంలో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరముంది. -
ఆర్టీయూకేటీ ప్రవేశాల నోటిఫికేషన్కు నిరీక్షణ
[ 02-05-2024]
బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాల నోటిఫికేషన్ కోసం విద్యార్థులకు నిరీక్షణ తప్పడం లేదు. పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆర్జీయూకేటీలో నేరుగా ప్రవేశాలు పొందేలా దరఖాస్తు చేసుకోవచ్చు. -
పని ప్రదేశమే.. ప్రచార వేదిక
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికలు మండుటెండల్లో వచ్చాయి. గ్రామాల్లో ఉపాధిహామీ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎండల దృష్ట్యా తెల్లవారంగానే పలుగు పారబట్టి పనులకు వెళుతున్నారు. -
అగ్నిగోళంగా ఆదిలాబాద్
[ 02-05-2024]
ఉమ్మడి జిల్లాలో బుధవారం సగటు ఉష్ణోగ్రత 42.9 డిగ్రీలు నమోదు కాగా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఇంకా ఎక్కువే నమోదైంది. మూడు రోజులుగా వడగాల్పుల తీవ్రత అధికమైంది. గత నెలలో వడదెబ్బ కారణంగా నలుగురు మృతి చెందారు. -
ముల్లె సదురుకున్నాం.. ఎల్లి పోతావున్నాం!
[ 02-05-2024]
‘ఏమున్నదక్కో.. ఏమున్నదక్కో.. ముల్లె సదురుకున్నా.. ఎల్లి పోతావున్నా.. ఈ ఊళ్లో నాకింక ఏమున్నదక్కో’ అంటూ ఓ సినీ గేయ రచయిత రాసిన గేయం ఇక్కడి ఆదివాసీలకు సరిగ్గా సరిపోతోంది. -
పర్యవేక్షణ బరువు.. వ్యవ‘సాయం’కరవు
[ 02-05-2024]
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఎరువుల దుకాణాలపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. దీంతో డీలర్లు ఇష్టానుసారంగా పురుగుమందులను అన్నదాతలకు అంటగడుతున్నారు. -
మద్యం వ్యాపారుల.. ‘మిలాఖత్’!
[ 02-05-2024]
మద్యం వ్యాపారులు సిండికేట్గా మారి కల్తీ, నిర్ణయించిన ధరల కంటే అధికంగా విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. నియంత్రించాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
మాటల వేఢీ
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతున్నకొద్దీ ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాన్ని రచిస్తూ పల్లెలు, పట్టణాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారంలో మునిగి తేలుతున్నారు. -
తెల్లవారుజామున ఎస్ఈ బదిలీ ఉత్తర్వులు
[ 02-05-2024]
విద్యుత్తు సంస్థ జిల్లా ఎస్ఈ రాథోడ్ శేషారావు ఆకస్మిక బదిలీ అయ్యారు. కార్పొరేట్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని బుధవారం తెల్లవారుజామున ఉత్తర్వులు వచ్చాయి. -
మీటరు గిరగిర..
[ 02-05-2024]
సూర్యుడి ప్రతాపంతో జిల్లాలో విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. వేడి కారణంగా ప్రజలు ఉక్కిరి బిక్కరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో అడుగు బయటపెట్టాలంటే వణికిపోతున్నారు. -
ఎట్టకేలకు హస్తం గూటికి..
[ 02-05-2024]
నాలుగు సార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు ఎంపీ, మరో రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఎట్టకేలకు బుధవారం భారాసను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. -
భానుడి భగభగలు.. జనం బెంబేలు
[ 02-05-2024]
వేసవితాపంతో అల్లాడి పోతున్నారు జనం. మూడు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొనుగోలుదారులు లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. -
సరిహద్దు చెక్పోస్టులపై ప్రత్యేక నిఘా
[ 02-05-2024]
ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులలో ఏర్పాటు చేసిన చెక్పోస్టులపై ప్రత్యేక నిఘా పెట్టి తనిఖీ చేపడుతున్నామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా బుధవారం ముథోల్ పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. -
ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా
[ 02-05-2024]
ఆడబిడ్డను పోటీ చేస్తున్నా.. ఆదరించి ఆశీర్వదించండి.. అభివృద్ధి చూసి చూపిస్తానని ఆదిలాబాద్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?