logo

25న విశ్రాంత ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య శిబిరం

జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో ఈనెల 25న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు.

Published : 23 Apr 2024 18:03 IST

ఆదిలాబాద్ సాంస్కృతికం: జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో ఈనెల 25న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు విశ్రాంత ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కంది లక్ష్మారెడ్డి, పడకంటి కిష్టయ్య పేర్కొన్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఈ శిబిరానికి హాజరు కావాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని