కొబ్బరి నీరు.. నిమ్మరసం.. ఓఆర్ఎస్
ఎండ, ఉక్కపోతతో నీరు చెమట రూపంలో శరీరం నుంచి బయటకు పోతోంది. కాసేపు ఎండలో ఉంటే నోరు, గొంతు తడారిపోతుంటాయి. దీంతో నీళ్లు అధికంగా తాగాలనిపిస్తుంది.
ఎండ, ఉక్కపోతతో నీరు చెమట రూపంలో శరీరం నుంచి బయటకు పోతోంది. కాసేపు ఎండలో ఉంటే నోరు, గొంతు తడారిపోతుంటాయి. దీంతో నీళ్లు అధికంగా తాగాలనిపిస్తుంది. ఈ నేపథ్యంలో డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ రోగులు తప్ప మిగతా వారు రోజూ 4-5 లీటర్ల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
* నీటితో పాటు సోడియం, పొటాషియం చెమట రూపంలో బయటకు పోతుంటాయి. నీరసం, నిస్సత్తువ ఆవహిస్తాయి. కేవలం నీటినే తీసుకోవడం వల్ల వాటిని తిరిగి భర్తీ చేయలేం.
* కేవలం నీళ్లు మాత్రమే కాకుండా ఉప్పు, కొంచెం చక్కెర కలిపిన నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ ద్రావణం తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల సోడియం, పొటాషియం ఇతర లవణాలు పుష్కలంగా శరీరానికి అందుతాయి.
* రోడ్ల పక్కన దొరికే నిమ్మరసం, ఐస్ క్రీమ్లు, ఐస్పై వేసి అమ్మే పుచ్చకాయ ముక్కలు ఇతర చల్లని పదార్థాలు తీసుకోవడం సహజమే. చల్లదనానికి చాలామంది అందులో ఐస్ కలుపుతుంటారు. దాని తయారీలో చాలా మంది ప్రమాణాలు పాటించరు. ఈ ఐస్తో తయారు చేసే పదార్థాలు, ద్రవాలు తీసుకోవడంతో దాహం తీరే మాటెలా ఉన్నా.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని గుర్తించాలి.
* మసాలాలు, ఇతర వేపుళ్లు, ఉప్పు పదార్థాలను తక్కువ తీసుకోవాలి. అధిక ఉప్పుతో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీంతో ఎక్కువ దాహం వేస్తుంది. ఈ సమయంలో ఎండలోకి వెళ్తే వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ కాలంలో నీటి శాతం అధికంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవాలి.
* ఏసీల్లో ఉండే వారు 3-4 లీటర్లు, ఎండలోకి పనికి వెళ్లే వారు 4-5 లీటర్ల ద్రవపదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎండలో పని చేసే కూలీలకు దాహం ఎక్కువ వేస్తుంటుంది. వీరు నీళ్లు కాకుండా ఉప్పు, పంచదార కలిపిన నిమ్మరసం, ఉప్పు కలిపిన మజ్జిగ తీసుకుంటూ ఉండాలి. దీంతో చెమట రూపంలో శరీరం కోల్పోయిన లవణాలన్నీ తిరిగి శరీరానికి అందించొచ్చు.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్ సభకు.. జన సునామీ!!
[ 02-05-2024]
పెందుర్తిలో ‘వారాహి విజయభేరి’ సభ జన సునామీని తలపించింది. బుధవారం రాత్రి నిర్వహించిన సభకు చిన్నారుల నుంచి పెద్దల వరకు భారీగా తరలివచ్చారు. -
చప్పగా సీఎం ప్రసంగం.. స్పందన అంతంతమాత్రం
[ 02-05-2024]
ఒకవైపు ఎండ.. మరోవైపు అంతంతమాత్రంగా వచ్చిన జనం.. వారిలోనూ కానరాని స్పందన.. మొత్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో కొత్త విషయాలేవీ లేకుండా చప్పగా సాగింది. -
బాలకృష్ణకు ఘన స్వాగతం
[ 02-05-2024]
ఉత్తరాంధ్రలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం మధ్యాహ్నం గన్నవరం నుంచి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. -
‘పాడి’కుండకు చిల్లు.. జగన్కే చెల్లు!
[ 02-05-2024]
పల్లె జీవనంలో, గ్రామాల అభివృద్ధిలో పాడిది విడదీయరాని పాత్ర. క్షీరధారలు ఎంత పొంగిపొర్లితే పల్లెలు అంత పచ్చగా ఉన్నట్టు, అన్నదాత ఆనందంగా ఉన్నట్టు. -
మీ భవితకు నాదీ భరోసా!
[ 02-05-2024]
యువత భవితకు నాదీ భరోసా అంటూ జనసేన అధినేత పవన్కల్యాణ్ హామీ ఇచ్చారు. -
వైకాపాకు ఓటమి తప్పదు
[ 02-05-2024]
మంచి, చెడుల మధ్య జరుగుతున్న యుద్ధంలో చెడుమార్గంలో నడుస్తున్న వైకాపాకు ఓటమి తప్పదని అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. -
చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం
[ 02-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని రంపచోడవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి అన్నారు. -
అన్నివర్గాల సంక్షేమమే కూటమి లక్ష్యం
[ 02-05-2024]
అన్నివర్గాల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ముందుకు సాగుతుందని.. ఇందుకు నిదర్శనం ఎన్నికల మ్యానిఫెస్టో అని తెదేపా రాష్ట్ర కార్యదర్శి ఎంవీవీ ప్రసాద్ అన్నారు. -
గ్రామాల్లో నాటుసారా కంపు
[ 02-05-2024]
మన్యంలోని కొన్ని గ్రామాలు నాటుసారా కర్మాగారాలుగా మారాయి. ఎన్నికల నేపథ్యంలో ఇది మరింత విచ్చలవిడి అయింది. -
సుకుమామిడిలో దాహం కేకలు
[ 02-05-2024]
చింతూరు మండలం కొత్తపల్లి పంచాయతీ సుకుమామిడి శివారు గూడెంలో తాగునీటి కష్టాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. -
వైకాపా అంతం.. కూటమి పంతం
[ 02-05-2024]
రానున్న ఎన్నికల్లో వైకాపా అంతమే కూటమి పంతమని భాజపా రాష్ట్ర మహిళ మోర్చా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి పేర్కొన్నారు. -
వేటాడి తాపీమేస్త్రి దారుణ హత్య
[ 02-05-2024]
బుచ్చెయ్యపేట మండల కేంద్రంలో బుధవారం ఉదయం చెరువు పనులకు, పొలాలకు వెళ్లే వారు, పాకల వద్దకు వెళ్లి పాలు తీసుకువచ్చేందుకు ఇళ్ల నుంచి ఒక్కొక్కరిగా బయలుదేరుతున్నారు.