మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
బుచ్చెయ్యపేటలో రాజీనామా లేఖలు చూపుతున్న వాలంటీర్లు
బుచ్చెయ్యపేట, న్యూస్టుడే: వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఎన్నికల విధులతోపాటు తాత్కాలికంగా పింఛన్ల పంపిణీ బాధ్యతల నుంచి వీరిని ఎన్నికల సంఘం పక్కన పెట్టింది. ఎన్నికల్లో తమకు అనుకూలంగా ప్రచారం చేయించుకోవడానికి వైకాపా నాయకులు వాలంటీర్లతో రాజీనామా చేయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తెదేపా అధికారంలోకి వస్తే గ్రామ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ప్రకటించడం, వాలంటీర్లకు రూ.పది వేల గౌరవ వేతనం ఇస్తామని చెప్పడంతో కొంతమంది రాజీనామాలకు వెనుకాడుతున్నారు. ఈ క్రమంలో బుచ్చెయ్యపేట మండలంలో ఇప్పటివరకు ఎవరూ రాజీనామా చేయలేదు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో గురువారం కొందరు రాజీమానాలు చేశారు. మరికొన్ని గ్రామాలకు చెందిన వాలంటీర్లు శుక్రవారం చేయనున్నట్లు సమాచారం.
48 మంది వాలంటీర్ల రాజీనామా
కె.కోటపాడు: మండలంలో 48 మంది వాలంటీర్లు గురువారం రాజీనామా చేశారని ఎంపీడీఓ అప్పలరాజు పేర్కొన్నారు. లంకవానిపాలెంలో 4, చౌడువాడలో 31, సూదివలసలో 5, రొంగలినాయుడుపాలెం, పైడమ్మపేట గ్రామాలకు చెందిన ఇద్దరు, గొట్లాంలో ఆరు గురు రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారని చెప్పారు.
చీడికాడ, దేవరాపల్లి: చీడికాడ మండలం కోనాం సచివాలయ పరిధిలోని గ్రామ వాలంటీర్లు రాజీనామా చేశారు. వీరంతా ఎంపీడీఓ ఉమామహేశ్వరి, కార్యాలయ సూపరింటెండెంట్ కామేశ్వరరావుకు రాజీనామా లేఖలు అందజేశారు. దేవరాపల్లి మండలం కలిగొట్ల, వెంకటరాజుపురం, తామరబ్బ పంచాయతీలకు చెందిన 32 మంది గ్రామ వాలంటీర్లు రాజీనామా చేస్తూ ఆయా పంచాయతీ కార్యదర్శులకు లేఖలు ఇచ్చారు.
అచ్యుతాపురం: వైకాపా నాయకులు ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నా రాజీనామా చేయడానికి వాలంటీర్లు ససేమిరా అంటున్నారు. మండలంలో 467 మంది ఉండగా ఇప్పటివరకు సగం మంది కూడా రాజీనామాకు ముందుకు రాలేదు. మార్టూరు నుంచి అతికష్టం మీద గురువారం రాజీనామా పత్రాలను ఎంపీడీఓ కార్యాలయం ఏఓ కృష్ణకు అందించారు. వాలంటీర్లు వైకాపా నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నా అందుకు అంగీకరించడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్ సభకు.. జన సునామీ!!
[ 02-05-2024]
పెందుర్తిలో ‘వారాహి విజయభేరి’ సభ జన సునామీని తలపించింది. బుధవారం రాత్రి నిర్వహించిన సభకు చిన్నారుల నుంచి పెద్దల వరకు భారీగా తరలివచ్చారు. -
‘పాడి’కుండకు చిల్లు.. జగన్కే చెల్లు!
[ 02-05-2024]
పల్లె జీవనంలో, గ్రామాల అభివృద్ధిలో పాడిది విడదీయరాని పాత్ర. క్షీరధారలు ఎంత పొంగిపొర్లితే పల్లెలు అంత పచ్చగా ఉన్నట్టు, అన్నదాత ఆనందంగా ఉన్నట్టు. -
మీ భవితకు నాదీ భరోసా!
[ 02-05-2024]
యువత భవితకు నాదీ భరోసా అంటూ జనసేన అధినేత పవన్కల్యాణ్ హామీ ఇచ్చారు. -
చప్పగా సీఎం ప్రసంగం.. స్పందన అంతంతమాత్రం
[ 02-05-2024]
ఒకవైపు ఎండ.. మరోవైపు అంతంతమాత్రంగా వచ్చిన జనం.. వారిలోనూ కానరాని స్పందన.. మొత్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో కొత్త విషయాలేవీ లేకుండా చప్పగా సాగింది. -
బాలకృష్ణకు ఘన స్వాగతం
[ 02-05-2024]
ఉత్తరాంధ్రలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం మధ్యాహ్నం గన్నవరం నుంచి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. -
వైకాపాకు ఓటమి తప్పదు
[ 02-05-2024]
మంచి, చెడుల మధ్య జరుగుతున్న యుద్ధంలో చెడుమార్గంలో నడుస్తున్న వైకాపాకు ఓటమి తప్పదని అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. -
చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం
[ 02-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని రంపచోడవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి అన్నారు. -
అన్నివర్గాల సంక్షేమమే కూటమి లక్ష్యం
[ 02-05-2024]
అన్నివర్గాల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ముందుకు సాగుతుందని.. ఇందుకు నిదర్శనం ఎన్నికల మ్యానిఫెస్టో అని తెదేపా రాష్ట్ర కార్యదర్శి ఎంవీవీ ప్రసాద్ అన్నారు. -
గ్రామాల్లో నాటుసారా కంపు
[ 02-05-2024]
మన్యంలోని కొన్ని గ్రామాలు నాటుసారా కర్మాగారాలుగా మారాయి. ఎన్నికల నేపథ్యంలో ఇది మరింత విచ్చలవిడి అయింది. -
సుకుమామిడిలో దాహం కేకలు
[ 02-05-2024]
చింతూరు మండలం కొత్తపల్లి పంచాయతీ సుకుమామిడి శివారు గూడెంలో తాగునీటి కష్టాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. -
వైకాపా అంతం.. కూటమి పంతం
[ 02-05-2024]
రానున్న ఎన్నికల్లో వైకాపా అంతమే కూటమి పంతమని భాజపా రాష్ట్ర మహిళ మోర్చా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి పేర్కొన్నారు. -
వేటాడి తాపీమేస్త్రి దారుణ హత్య
[ 02-05-2024]
బుచ్చెయ్యపేట మండల కేంద్రంలో బుధవారం ఉదయం చెరువు పనులకు, పొలాలకు వెళ్లే వారు, పాకల వద్దకు వెళ్లి పాలు తీసుకువచ్చేందుకు ఇళ్ల నుంచి ఒక్కొక్కరిగా బయలుదేరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?