గిరిజనులు చింత తీరేనా?
అల్లూరి జిల్లాలో ఈ ఏడాది చింతపండు దిగుబడులు గిరిజన రైతులను పూర్తిగా నిరాశపరిచాయి.
ధరల ప్రకటనలకే పరిమితమైన జీసీసీ
చింతపండు సేకరణలో గిరిజన మహిళ
చింతపల్లి, న్యూస్టుడే: అల్లూరి జిల్లాలో ఈ ఏడాది చింతపండు దిగుబడులు గిరిజన రైతులను పూర్తిగా నిరాశపరిచాయి. సహజంగా దిగుబడులు తగ్గితే ఏ పంటకైనా గిరాకీ ఏర్పడి ధరలు పెరుగుతాయి. కానీ చింతపండు విషయంలో భిన్నమైన పరిస్థితి. స్థానికంగా ఉన్న వ్యాపారులపైనే ధరలు ఆధారపడి ఉన్నాయి. గిరిజనులు పండించే పంటలు, సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకే తామున్నామంటూ భరోసా ఇచ్చే జీసీసీ (గిరిజన సహకార సంస్థ) నామమాత్రంగా మారింది. గతంలో చింతపండు విషయంలో గిరిజన సహకార సంస్థకు గుత్తాధిపత్యం ఉండేది. ఆ అధికారాలను కేంద్రం కొన్నేళ్ల కిందటే తొలగించింది. గిరిజన రైతులు పండించిన ఈ పంటను ఎవరికైనా అమ్ముకునే వెసులుబాటు కలిగింది. తేనె, నరమామిడిచెక్క, నల్ల జీడిపిక్కలు, కరక్కాయలు వంటి ఇతర అటవీ ఉత్పత్తులను జీసీసీ కొనుగోలు చేస్తోంది. వాటితోపాటే చింతపండుకూ గిట్టుబాటు ధరను నిర్ధారించింది. కిలో పిక్క తీయనిది రూ.32.40, పిక్క తీసినది రూ.63గా మద్దతు ధరలు ప్రకటించింది.
వ్యాపారులే నయం
గిరిజన సహకార సంస్థ గిరిజన రైతుల నుంచి చింతపండును కొనుగోలు చేస్తామని ప్రకటనలు గుప్పించడం తప్ప కొనుగోళ్లను ఇప్పటివరకు ప్రారంభించలేదు. కేవలం గిట్టుబాటు ధరలను ప్రకటించి ఊరుకుంది. జీసీసీ ప్రకటించిన ధరలకు మించి బయట వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం వ్యాపారులు కిలో పిక్కతీయనిది కిలో రూ.40 వరకూ కొంటున్నారు. భవిష్యత్తులో దీని ధర మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో జీసీసీ నామమాత్రంగా మారింది. గిట్టుబాటు ధరలు కల్పించి జీసీసీ ద్వారా పంట కొనుగోలు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.
గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నాం
గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు గిరిజన సహకార సంస్థ ద్వారా ఈ ఏడాది మెరుగైన గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నాం. గతంలో కిలో రూ.200 ఉండే తేనె ధర ప్రస్తుతం రూ.250కి పెంచాం. ఎండిన ఉసిరిపప్పును కిలో రూ.80కి కొనుగోలు చేస్తున్నాం. నల్లజీడి గింజలు, కరక్కాయలు కిలో రూ.18కు కొంటున్నాం. శీకాయ కిలో రూ.55, కుంకుడు కాయలు కిలో రూ.35కి కొంటున్నాం. చింతపండు విషయంలో మా సిబ్బందిపై ఒత్తిడి చేయడం లేదు. జీసీసీ ప్రకటించిన ధర కంటే ఎక్కువకు వ్యాపారులు కొంటే మాకు ఎటువంటి ఇబ్బందీ లేదు. అంతకు మించి తక్కువకు కొంటే అభ్యంతరం చెబుతాం. చెక్పోస్టుల్లో తగిన బిల్లులు చూపించి చింతపండును మైదాన ప్రాంతాలకు తరలించుకోవచ్చు. దళారుల వలలో చిక్కుకోవద్దని గిరిజనులకు సూచిస్తున్నాం.
దేవరాజు, జీసీసీ డీఎం, చింతపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జననేతనన్నావు.. జలమేదీ జగన్?
[ 04-05-2024]
బటన్లు నొక్కే జగన్కు జనాల బాధలు పట్టడం లేదు. ఈ అయిదేళ్లలో తాగునీటి పథకాలకు పార్టీ రంగులు వేసి ప్రచారం చేసుకోవాలని చూశారు తప్ప ప్రజల గొంతు తడిపే ప్రయత్నమే చేయలేదు. వైకాపా పాలనలో గ్రామాల్లో కొత్తగా నీళ్ల కుండీలను నిర్మించిందీ లేదు. -
జగన్ను ఇంటికి పంపితేనే మన్యం అభివృద్ధి
[ 04-05-2024]
అధ్వాన పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రంపచోడవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి ఎద్దేవా చేశారు. -
జగనన్న కక్ష.. అవ్వాతాతలకు శిక్ష
[ 04-05-2024]
పింఛను సొమ్ము సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేసే అవకాశం ఉన్నా తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులను బలిపశువులను చేసింది. -
వైకాపా పతనం ఖాయం
[ 04-05-2024]
త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు తథ్యమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు, తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి దొన్నుదొర పేర్కొన్నారు. -
వైకాపా వాహనం స్వాధీనం
[ 04-05-2024]
అనుమతులు లేకుండా వైకాపా ప్రచార సామగ్రి తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎంపీడీవో, ఎన్నికల అధికారి వెంకటరావు తెలిపారు. -
తెదేపాలో భారీగా చేరికలు
[ 04-05-2024]
దామనాపల్లి, సంకాడ పంచాయతీల నుంచి వైకాపా, సీపీఎంలకు చెందిన కార్యకర్తలు భారీగా తెదేపాలోకి చేరారు. మాడెం, బంధవీధి, దొడ్డికొండరెల్లివీధి, చిన్నజడుమూరు గ్రామాలనుంచి సుమారు 200 మంది పాడేరు కూటమి అసెంబ్లీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
ఉద్యోగాలిప్పిస్తామని టోకరా
[ 04-05-2024]
ఉద్యోగాలిప్పిస్తామని గిరిజన యువతను ఇద్దరు మహిళలు మోసం చేశారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. -
పేదల పొట్టకొట్టిన జగమొండి
[ 04-05-2024]
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్నవారి కడుపునింపడంలోనూ రాజకీయాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. ఓపక్క పేదల పక్షపాతినని ఊదరగొడుతూనే మరోవైపు అదే పేదల పొట్టకొట్టారు. -
‘జగన్కు ఒక్క అవకాశమిచ్చి అందరం మోసపోయాం’
[ 04-05-2024]
‘గత ఎన్నికల్లో జగన్ ఒక్క అవకాశం అని అడిగితే ఇచ్చి అందరం మోసపోయాం. ఈ ఐదేళ్లలో అభివృద్ధి లేదు. సంక్షేమంలో ఆశ్రిత పక్షపాతం పెరిగిపోయింది. -
తెదేపాలో చేరిన వైకాపా నాయకులు
[ 04-05-2024]
ఎలమంచిలిలోని దిమిలిరోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించనున్న నందమూరి బాలకృష్ణ సభకు తెదేపా నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కూడలిని జెండాలతో అందంగా తయారు చేశారు. -
కాంగ్రెస్తోనే ప్రత్యేక హోదా
[ 04-05-2024]
కాంగ్రెస్ గెలుపుతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవచ్చని ఆ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి సతక బుల్లిబాబు అన్నారు. మంప, రేవళ్లు పంచాయతీల్లోని గ్రామాల్లో శుక్రవారం సీపీఐ నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. -
జగనన్నా.. ఎమిటీ పింఛన్ వెతలు..
[ 04-05-2024]
పింఛన్లకోసం బ్యాంకులకు వచ్చిన వృద్ధులకు రెండో రోజు కష్టాలు తప్పలేదు. వీఆర్పురం మండలం రేఖపల్లిలో బ్యాంకు వద్ద రేఖపల్లి, జీడిగుప్పల పీహెచ్సీల వైద్యులు శిబిరం ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం