తెదేపాలో భారీగా చేరికలు
దామనాపల్లి, సంకాడ పంచాయతీల నుంచి వైకాపా, సీపీఎంలకు చెందిన కార్యకర్తలు భారీగా తెదేపాలోకి చేరారు. మాడెం, బంధవీధి, దొడ్డికొండరెల్లివీధి, చిన్నజడుమూరు గ్రామాలనుంచి సుమారు 200 మంది పాడేరు కూటమి అసెంబ్లీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.
గూడెంకొత్తవీధి, న్యూస్టుడే: దామనాపల్లి, సంకాడ పంచాయతీల నుంచి వైకాపా, సీపీఎంలకు చెందిన కార్యకర్తలు భారీగా తెదేపాలోకి చేరారు. మాడెం, బంధవీధి, దొడ్డికొండరెల్లివీధి, చిన్నజడుమూరు గ్రామాలనుంచి సుమారు 200 మంది పాడేరు కూటమి అసెంబ్లీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఆమె కండువాలు కప్పి ఆహ్వానించారు. వైకాపాపై నమ్మకం లేకనే తెదేపాలో చేరుతున్నారని ఆమె పేర్కొన్నారు. తెదేపా మండల అధ్యక్షుడు ముక్కలి రమేష్, ప్రధాన కార్యదర్శి మామిడి నాగేంద్ర, దేవరాపల్లి సర్పంచి బుజ్జిబాబు, తెదేపా సీనియర్ నాయకుడు చల్లంగి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
ఆదరణ చూడలేకే అడ్డంకులు
గిరిజన గ్రామాల్లో కూటమికి వస్తున్న ఆదరణ చూడలేకే ప్రచారంలో అడ్డంకులు సృష్టిస్తున్నారని గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. దామనాపల్లి పంచాయతీ దొడ్డికొండ, మాడెంకొలనీ, సిగినాపల్లి, సంకాడ పంచాయతీల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మహిళలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. సంకాడలో ప్రచారం నిర్వహిస్తుండగా ఎస్సై అప్పలసూరి ఆమె వద్దకు వచ్చి సంతకం చేయాలని కోరడంతో ఇరువురి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. ఈశ్వరి మాట్లాడుతూ.. తాము నిబంధనల ప్రకారమే ప్రచారం చేపడుతున్నామని తెలిపారు. వైకాపా నాయకులు పోలీసుల సహాయంతో ప్రచారానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి ఇబ్బందులు తొలగాలంటే కూటమి అధికారంలోకి రావాలని చెప్పారు. ఎంపీగా కొత్తపల్లి గీతను, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. కూటమి అధికారంలోకి వస్తే బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15 వేలు, గృహిణులకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలెండర్లతో పాటు ఇతర సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏదీ జీవం.. ఎక్కడా వైవిధ్యం!
[ 22-05-2024]
మానవ తప్పిదాలతో కాలక్రమంలో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. ఆధునిక జీవన శైలిలో పర్యావరణం కాలుష్యానికి గురవుతోంది. భూగోళం వేడెక్కిపోతోంది. దీంతో జీవవైవిధ్యానికి ముప్పు వాటిల్లుతోంది. -
నిర్మించి నెల.. పెచ్చులూడిందిలా..
[ 22-05-2024]
వైకాపా ప్రభుత్వంలో మన్యం ప్రాంతంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడమే గగనమైంది. చేసిన కొద్ది పనులూ నాణ్యతగా చేపట్టకపోవడంతో అధ్వానంగా తయారవుతున్నాయి. -
కొనలేం.. తినలేం
[ 22-05-2024]
వేసవిలో కమ్మటి సువాసనతో అందరి నోరూరించే మామిడిపండు ఈ ఏడాది ప్రియమైపోయింది. దిగుబడులు భారీగా తగ్గడం, ఇతర ప్రాంతాల్లో డిమాండుతో సామాన్యులు మనస్ఫూర్తిగా తినే పరిస్థితి లేకుండా పోయింది. -
ఇతరులను అనుమతించొద్దు
[ 22-05-2024]
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్రూంల వద్దకు ఇతరులను అనుమతించొద్దని కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ తుహిన్ సిన్హా పేర్కొన్నారు. -
ఓట్ల లెక్కింపు వరకు అప్రమత్తం
[ 22-05-2024]
పెదబయలు పోలీసుస్టేషన్ను ఎస్పీ తుహిన్ సిన్హా, సీఐ రమేష్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్సై మనోజ్కుమార్, సిబ్బందితో సమావేశమయ్యారు. -
తెలంగాణ సీసీఎస్ డీఎస్పీ స్వగ్రామంలో సోదాలు
[ 22-05-2024]
హైదరాబాద్లో అవినీతి నిరోధక శాఖకు చిక్కిన తెలంగాణ సీసీఎస్ డీఎస్పీ ఉమామహేశ్వరరావు స్వగ్రామమైన బుచ్చెయ్యపేట మండలం బంగారుమెట్ట, రోలుగుంటలోని బంధువుల ఇళ్లలో మంగళవారం ఉన్నతాధికారులు తనిఖీలు చేశారు. -
సజావుగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు
[ 22-05-2024]
జిల్లాలో ఈనెల 24 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారిణి బి.పద్మావతి సంబంధిత అధికారులను ఆదేశించారు. -
ఆర్ఎంపీ వైద్యంతో రోగి మృతిపై విచారణ
[ 22-05-2024]
ఆర్.ఎం.పి. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా ఓ రోగి మృతిచెందాడనే ఆరోపణపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. -
అంగన్వాడీల నేత తులసి హఠాన్మరణం
[ 22-05-2024]
అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు వై.తులసి (45) మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఈమె అంగన్వాడీల సమస్యలపై గత ఇరవై ఏళ్లుగా పోరాటాలు చేస్తూ ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.