logo

వైకాపా వాహనం స్వాధీనం

అనుమతులు లేకుండా వైకాపా ప్రచార సామగ్రి తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎంపీడీవో, ఎన్నికల అధికారి వెంకటరావు తెలిపారు.

Published : 04 May 2024 01:34 IST

హుకుంపేట, న్యూస్‌టుడే: అనుమతులు లేకుండా వైకాపా ప్రచార సామగ్రి తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎంపీడీవో, ఎన్నికల అధికారి వెంకటరావు తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక కామయ్యపేట కూడలి వద్ద తనిఖీలు చేస్తుండగా వాహనంలో గోని సంచులతో తరలిస్తున్న టీషర్టులు, టోపీలు, వైకాపా స్టిక్కర్లు గుర్తించారు. అనుమతులు లేకుండా వీటిని తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారు డ్రైవర్‌ మాధవరావును సీఐ సన్యాసినాయుడు, ఎస్‌ఐ సతీష్‌కు అప్పగించామని ఎంపీడీవో తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా ప్రచారాలకు వాహనాలు తరలించినా, పార్టీల స్టికర్లు అందించినా, కోడ్‌ ఉల్లంఘించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల రాపిడ్‌ యాక్షన్‌ సిబ్బంది చోడిపల్లి రాము, నిరంజన్‌కుమార్‌, దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని