పదోతరగతి ఫలితాల్లో జిల్లాల ర్యాంకులు కిందికి!
పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే పెరిగినా రాష్ట్రస్థాయిలో విశాఖ, అనకాపల్లి జిల్లాల స్థానాలు మాత్రం దిగజారిపోయాయి.
ఈనాడు, అనకాపల్లి
పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే పెరిగినా రాష్ట్రస్థాయిలో విశాఖ, అనకాపల్లి జిల్లాల స్థానాలు మాత్రం దిగజారిపోయాయి. అల్లూరి జిల్లాలో విద్యార్థులు సత్తా చాటడంతో ఆ జిల్లా స్థానం కాస్త మెరుగుపడింది. గతేడాది 82.68 శాతం ఉత్తీర్ణతతో విశాఖ జిల్లా మూడోస్థానంలో నిలవగా, ఈ ఏడాది ఉతీర్ణత 91.15 శాతానికి పెరిగినా జిల్లా ర్యాంకు ఎనిమిదో స్థానానికి పడిపోయింది. అనకాపల్లి జిల్లా గతేడాది 77.74 శాతం ఉత్తీర్ణతతో అయిదో స్థానంలో నిలిస్తే ఈ ఏడాది 89.04 శాతం ఉత్తీర్ణత నమోదు చేసినా, రాష్ట్ర స్థాయిలో జిల్లా ర్యాంకు 12వ స్థానానికి దిగజారిపోయింది. అల్లూరి సీతారామరాజు జిల్లా గతేడాది 61.41 శాతం ఉత్తీర్ణతతో 24వ నిలవగా ఈసారి 90.95 శాతంతో తొమ్మిదో స్థానానికి ఎగబాకింది. మార్చి 18 నుంచి 28 వరకు జరిగిన పరీక్షలకు ఈ మూడు జిల్లాల నుంచి మొత్తం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు విద్యార్థులు 60,291 మంది పరీక్షలకు హాజరైతే 54,485 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎప్పటిలాగే ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు.
- 2019-20, 20-21 వరుస రెండేళ్లు పదోతరగతి పరీక్షలను కొవిడ్ కారణంగా నిర్వహించలేదు.. అందరు విద్యార్థులనూ ఉత్తీర్ణులు చేశారు.
- గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రథమ శ్రేణిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
- సబ్జెక్టు టీచర్ల కొరత, ఏడాది పొడవునా సిఫార్సు బదిలీలు చేపట్టడం, నాడు నేడు పనులపై చూపిన శ్రద్ధ బోధనపై అధికారులు చూపకపోవడంతో జిల్లా ర్యాంకులు పడిపోయినట్లు విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు.
పరీక్ష నాడే తండ్రి మృతి.. దిగమింగుకుని కుమారుడి ప్రతిభ
రాజవొమ్మంగి, న్యూస్టుడే: రాజవొమ్మంగి అల్లూరి సీతారామరాజు జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి పరిశిక చరణ్ తేజ పబ్లిక్ పరీక్షల్లో జీవశాస్త్రం పరీక్ష రోజున తండ్రి బాలరాజు మృతి చెందాడు. అయినా పుట్టెడు దుఃఖంలో పరీక్షలు రాశాడు. సోమవారం విడుదలైన పరీక్ష ఫలితాల్లో చరణ్ ఉత్తీర్ణుడయ్యాడు. చరణ్ను ప్రధానోపాధ్యాయుడు గోపాలకృష్ణ, పీఎంసీ ఛైర్మన్ వీరబాబు, ఉపాధ్యాయులు అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జననేతనన్నావు.. జలమేదీ జగన్?
[ 04-05-2024]
బటన్లు నొక్కే జగన్కు జనాల బాధలు పట్టడం లేదు. ఈ అయిదేళ్లలో తాగునీటి పథకాలకు పార్టీ రంగులు వేసి ప్రచారం చేసుకోవాలని చూశారు తప్ప ప్రజల గొంతు తడిపే ప్రయత్నమే చేయలేదు. వైకాపా పాలనలో గ్రామాల్లో కొత్తగా నీళ్ల కుండీలను నిర్మించిందీ లేదు. -
జగన్ను ఇంటికి పంపితేనే మన్యం అభివృద్ధి
[ 04-05-2024]
అధ్వాన పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రంపచోడవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి ఎద్దేవా చేశారు. -
జగనన్న కక్ష.. అవ్వాతాతలకు శిక్ష
[ 04-05-2024]
పింఛను సొమ్ము సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేసే అవకాశం ఉన్నా తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులను బలిపశువులను చేసింది. -
వైకాపా పతనం ఖాయం
[ 04-05-2024]
త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు తథ్యమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు, తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి దొన్నుదొర పేర్కొన్నారు. -
వైకాపా వాహనం స్వాధీనం
[ 04-05-2024]
అనుమతులు లేకుండా వైకాపా ప్రచార సామగ్రి తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎంపీడీవో, ఎన్నికల అధికారి వెంకటరావు తెలిపారు. -
తెదేపాలో భారీగా చేరికలు
[ 04-05-2024]
దామనాపల్లి, సంకాడ పంచాయతీల నుంచి వైకాపా, సీపీఎంలకు చెందిన కార్యకర్తలు భారీగా తెదేపాలోకి చేరారు. మాడెం, బంధవీధి, దొడ్డికొండరెల్లివీధి, చిన్నజడుమూరు గ్రామాలనుంచి సుమారు 200 మంది పాడేరు కూటమి అసెంబ్లీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
ఉద్యోగాలిప్పిస్తామని టోకరా
[ 04-05-2024]
ఉద్యోగాలిప్పిస్తామని గిరిజన యువతను ఇద్దరు మహిళలు మోసం చేశారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. -
పేదల పొట్టకొట్టిన జగమొండి
[ 04-05-2024]
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్నవారి కడుపునింపడంలోనూ రాజకీయాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. ఓపక్క పేదల పక్షపాతినని ఊదరగొడుతూనే మరోవైపు అదే పేదల పొట్టకొట్టారు. -
‘జగన్కు ఒక్క అవకాశమిచ్చి అందరం మోసపోయాం’
[ 04-05-2024]
‘గత ఎన్నికల్లో జగన్ ఒక్క అవకాశం అని అడిగితే ఇచ్చి అందరం మోసపోయాం. ఈ ఐదేళ్లలో అభివృద్ధి లేదు. సంక్షేమంలో ఆశ్రిత పక్షపాతం పెరిగిపోయింది. -
తెదేపాలో చేరిన వైకాపా నాయకులు
[ 04-05-2024]
ఎలమంచిలిలోని దిమిలిరోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించనున్న నందమూరి బాలకృష్ణ సభకు తెదేపా నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కూడలిని జెండాలతో అందంగా తయారు చేశారు. -
కాంగ్రెస్తోనే ప్రత్యేక హోదా
[ 04-05-2024]
కాంగ్రెస్ గెలుపుతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవచ్చని ఆ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి సతక బుల్లిబాబు అన్నారు. మంప, రేవళ్లు పంచాయతీల్లోని గ్రామాల్లో శుక్రవారం సీపీఐ నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. -
జగనన్నా.. ఎమిటీ పింఛన్ వెతలు..
[ 04-05-2024]
పింఛన్లకోసం బ్యాంకులకు వచ్చిన వృద్ధులకు రెండో రోజు కష్టాలు తప్పలేదు. వీఆర్పురం మండలం రేఖపల్లిలో బ్యాంకు వద్ద రేఖపల్లి, జీడిగుప్పల పీహెచ్సీల వైద్యులు శిబిరం ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!